Friday, April 19, 2024
- Advertisement -

తెలంగాణా కేబినేట్‌లోకి ఇద్ద‌రు మ‌హిళ‌లు…

- Advertisement -

మంత్రి మండ‌లి విష‌యంలో తెలంగాణా సీఎం కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ సారి కేబినేట్‌లో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు చోటు క‌ల్పిస్తామ‌ని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కేబినెట్‌లోకి మరో ఆరుగురిని తీసుకోవాల్సి ఉందని.. విస్తరణ సమయంలో మహిళలకు అవకాశం ఇస్తామన్నారు. ఈరోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ సందర్భంగా కేసీఆర్ ఈ మేరకు స్పందించారు. తమకు మహిళలపై అమితమైన గౌరవం ఉందని అందుకే…ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది మహిళలే తమకు ఓట్లు వేశారనీ, అందువల్లే తాము ఇక్కడ కూర్చున్నామని సీఎం వ్యాఖ్యానించారు.గతంలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన పద్మాదేవేందర్‌రెడ్డి, గతంలో ప్రభుత్వ విప్‌గా పనిచేసిన గొంగిడి సునీత, ఇక రెండోసారి రేఖానాయక్‌ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. తాజాగా సత్యవతి రాథోడ్‌కు ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించారు. మ‌రి న‌లుగురిలో ఇద్రికి మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌నున్నాయి. ఆ అదృష్ట వంతులో ఎవ‌రో….?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -