Saturday, April 20, 2024
- Advertisement -

అపోలో హాస్పిటల్ లో కరోనా కేసును గుర్తించాం : ఉపాసన కొణిదెల

- Advertisement -

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తుంది కరోనా వైరస్. చైనాలో ఇప్పటికే ఈ వైరస్ కారణంగా చాలా మంది చనిపోయారు. అంతేకాకుండా ఇతర దేశాలకు కూడా ఈ వైరస్ వ్యాపిస్తోంది. ఈ వైరస్ వల్ల ప్రజలు చాలా భయపడుతున్నారు.

అయితే ఇండియాలో కూడా అక్కడ అక్కడ ఈ కరోనా వైరస్ కేసులు కనిపిస్తున్నాయి. తాజాగా సికింద్రబాద్ లోని అపోలో ఆసుపత్రిలో కరోనా వైరస్ కేసును గుర్తించామని కొణిదెల ఉపాసన తెలిపారు. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ ద్వారా ఓ ట్వీట్, వీడియోను పెట్టిన ఆమె, కరోనా వైరస్ పై అపోలోనే స్క్రీనింగ్ ప్రొటోకాల్స్ ను అత్యంత కచ్ఛితత్వంతో పాటిస్తున్నామని అన్నారు. సదరు పేషంట్ ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

మిగతా రోగులకు అతన్ని దూరంగా ఉంచి.. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో చికిత్సను అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా ఇన్పెక్షన్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలు బాధ్యతగా ఉండి, ఏ మాత్రం వ్యాధి లక్షణాలు కనిపించినా.. వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -