Friday, April 19, 2024
- Advertisement -

ఆంధ్రాఆక్టోప‌స్‌తో వంగ‌వీటి రాధా భేటీ..జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

- Advertisement -

త్వ‌ర‌లో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రానుండ‌టంతో రాష్ట్ర రాజకీయాలు మ‌రింత వేడెక్కాయి. అన్ని పార్టీలు విజ‌యం కోసం తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. అయితే వైసీపీ నుంచి బ‌ట‌య‌కు వెళ్లిన వంగ‌వీటి రాధా ఆంధ్రా ఆక్టోప‌స్ ల‌గ‌డ‌పాటితో భేటీ అవ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. భేటీ అనంత‌రం రాధా జ‌గ‌న్ పై కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అవి ఇప్పుడు రాజ‌కీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి.

వైసీపీకీ రాజీనామా చేసిన రాధా టీడీపీలో చేరుతున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌తంలోనే పార్టీలో చేరాల‌ని భావించినా ఎందుకో వాయిదా ప‌డింది. తాజాగా ఆయన తన అనుచరులు, సన్నిహితులతో విస్తృతస్థాయిలో చర్చిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన లగడపాటిని కలిశారని సమాచారం. వచ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఓట‌మే ల‌క్ష్యంగా పనిచేస్తానని రాధాకృష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జగన్ కు, వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని తెలిపారు.

తన తండ్రి వంగవీటి రంగాను అవ మానించేలా జగన్‌ వ్యవహరించారని రాధా ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ఆ పార్టీ నేతలు తనను కలిసి పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. టీడీపీలో చేర‌డం కీల‌క నిర్ణ‌యం కావ‌డంతో త‌న అనుచ‌రుల‌తో చ‌ర్చిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -