టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో మంచి పట్టు ఉంది. అయితే ప్రస్తుతం అధికారంలో వైసీపీ ఉండటంతో.. ఓ వైపు కేసుల భయం.. ఇంకోవైపు బిజినెస్ లు కాపాడుకోవడంకోసం అయన వైసీపీలోకి వెళ్లేందుకు సిద్దం అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 16న ఆయన వైసీపీలో చేరేందుకు డేట్ ఫిక్స్ కూడా చేశారన్న వార్తలు వచ్చాయి.
తర్వాత ఎందుకో వైసీపీ గంటవైపు పాజిటివ్ గా లేరన్న విషయం రాజకీయవర్గాలను ఆశ్చర్యపరిచింది. వైసీపీలోకి గంటాను ఎందుకు తీసుకోలేదన్న విషయంను సోషల్ మీడియాలో ఆరాతీస్తే.. గంటా ఇప్పటివరకు ఎన్నికల్లో గెలవడానికి నాలుగు నియోజకవర్గాలు మారి అక్కడ పార్టీని బలోపేతం చేయకుండా తన బిజినెస్ లు చేసుకొని వైజాగ్ అంతా తన గుప్పిట్లో పెట్టుకొన్నాడని.. మంత్రిగా ఉన్న టైంలో అంతా తన మేనల్లుడు అయిన విజయ్ తో ట్రాన్సాక్షన్స్ చేపించి పెద్దఎత్తున గోల్ మాల్ చేశాడని ఈ మధ్య ప్రముఖ చానెల్ లో 30 మినిట్స్ ప్రోగ్రాం ఇచ్చిందట.
అందుకే గంటాను వైసీపీ అధిష్టానం హోల్డ్ లో పెట్టేసిందని సమాచారం. గంటా తన స్వార్థం కోసమే వైసీపీలో వస్తున్నారని.. వైసీపీ సీనియర్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. గంటాను రాకను ఇప్పటికే మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యతిరేకించారు. ఎంపీ విజయసాయిరెడ్డి వ్యతిరేకంగా ట్వీట్లు చేశారు. ఈ క్రమంలోనే పునరాలోచనలో పడిన వైసీపీ అధిష్టానం గంటాకు బ్రేకులు వేసినట్లు సమాచారం.
వైఎస్సార్ చేయూత.. మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త..!
రాపాక విషయంలో జగన్ ను ఫాలో అవుతున్న పవన్.. ఎలా అంటే ?