మొన్నటి ఎన్నికల వేళ.. టీడీపీతో తెరవెనుక బంధం ఏర్పాటు చేసుకొని అధికార పక్షాన్ని వదిలేసి.. ప్రతిపక్ష వైసీపీని టార్గెట్ చేసిన జనసేనాని పవన్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. చిత్తుగా ఓడిపోయాడు. కానీ ఇప్పుడు వైసీపీ శ్రేణులకు టార్గెట్ గా మారారు.
అయితే ఇప్పటికీ జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీకి ఫేవర్ గా రాజకీయాలు చేస్తున్నాడని వైసీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. జగన్ 100 రోజుల పాలనపై జనసేన పుస్తకాన్ని విడుదల చేసింది. ఇందులో వైసీపీ ప్రభుత్వం.. సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యాడని ఆరోపించింది. ఇదే పవన్ టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక్క పుస్తకాన్ని విడుదల చేయకపోవడం గమనార్హం.
తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసాను కూడా టీడీపీ టార్గెట్ చేసి విమర్శలు కురిపించింది. టీడీపీకి మద్దతుగా పవన్ చేసిన ప్రకటన కూడా దుమారం రేపింది. అర్హతగల రైతులను విస్మరించారని జనసేనాని విమర్శించారు. కేంద్ర నిధులను రాష్ట్ర నిధులతో కలిపి ఇవ్వడంపైన పవన్ విమర్శించారు.
అయితే ఇప్పుడు పవన్ ను టార్గెట్ చేసి వైసీపీ జోరుగానే సోషల్ మీడియాలో ఎండగడుతోంది. చంద్రబాబు పాలించిన 2014-19 మధ్య ఆయన విస్మరించిన ఎన్నికల వాగ్ధానాలపై పవన్ కళ్యాణ్ ఒక్క ప్రకటన కూడా విడుదల చేయకపోవడంపై పవన్ ను వైసీపీ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. బాబు అమలు చేయని రైతు రుణమాఫీ పవన్ కు ఎందుకు కనిపించలేదని విమర్శిస్తున్నారు.
చంద్రబాబు చేస్తే సంసారం.. వైసీపీ చేస్తే వ్యభిచారామా పవన్ కళ్యాణ్ అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో జనసేనానిని టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు వైసీపీ మద్దతుదారులు.. పవన్ చేస్తున్న ఈ తెరవెనుక రాజకీయాలు వీడాలని.. ముసుగు తీయాలని కోరుతున్నారు.