వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతున్నారు. ఉదయం ఇడుపుల పాయలో అసెంబ్లీ, లోక్సభ అభ్యర్ధుల జాబితాను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో బీసీలకు పెద్ద పీట వేశామని జగన్ తెలిపారు. తాజాగా విడుదల చేసిన జాబితాలో లోక్సభ అభ్యర్థులుగా నలుగురు మహిళలకు చోటు కల్పించారు. అలాగే అసెంబ్లీ అభ్యర్థులుగా 11 మంది మహిళలకు చోటు కల్పించారు.
వైసీపీ మహిళా లోక్సభ అభ్యర్థులు
1)అమలాపురం-చింతా అనురాధ
2)అనకాపల్లి-కండ్రేగుల వెంకట సత్యవతి
3)కాకినాడ-వంగా గీత
4)అరకు- గొడ్డేటి మాధవి
అసెంబ్లీ మహిళా అభ్యర్ధలు…
1)ఉషా శ్రీ చరణ్-కల్యాణదుర్గం-అనంతపురం
2)జొన్నలగడ్డ పద్మావతి-సింగనమల(ఎస్సీ)-అనంతపురం
3)సుచరిత మేకతోటి–తూర్పు గోదావరి
4)ఉండవల్లి శ్రీదేవి-తాడికొండ(ఎస్సీ)-గుంటూరు
5)విడదల రజిని-చిలకలూరిపేట-గుంటూరు
6)కె శ్రీదేవి-పత్తికొండ-కర్నూలు
7)వనితా తానేటి-కొవ్వూరు(ఎస్సీ)-పశ్చిమ గోదావరి
8)తోట వాణి-పెద్దాపురం-తూర్పు గోదావరి
9)భాగ్యలక్ష్మి-పాడేరు(ఎస్టీ)-విశాఖపట్నం
10)రోజా సెల్వమణి-నగరి-చిత్తూరు
11)పాముల పుష్ప శ్రీవాణి-కురుపం(ఎస్టీ)-విజయనగరం