సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న అసత్య ప్రచారంపై వైఎస్ షర్మిల తన ఆవేదనను వ్యక్తం చేశారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ ఆమె ఇవాళ హైదరాబాద్ కమీషనర్ అంజనీ కుమార్నును కలసి ఫిర్యాదు చేశారు. సినీ హీరో ప్రభాస్తో తనకు సంబంధం ఉందని ఆరోపిస్తూ జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పేరుతో సోషల్ మీడియాలో తనపై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
షర్మిలపై 2014 ఎన్నికల తర్వాత నుంచి దుష్ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దుష్ప్రచారం ఆగిందన్నారు. కాని ఇప్పుడు ఎన్నికల సమయంలో మరో సారి సోషియల్ మీడియాలో తనపైవిషప్రచారానికి వేగం పెంచారని.. తప్పును తప్పు ఎత్తిచూపడానికి చట్టప్రకారం ఈ ప్రచారం సృష్టిస్తున్నవారిపై, వారి వెనుక ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని సీపీని కోరినట్లు ఆమె తెలిపారు.
సోషియల్ మీడియాలో దుష్ప్రచారం వల్ల మాకుటుంబం పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ భార్యగా, ఓ తల్లిగా, ఓ చెల్లిగా తన నైతికతను నిజాయితిని నిరూపించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఈ రోజు నా గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం నాకుంది గనుక, మీ అందరి ముందుకు వచ్చి చెబుతున్నానన్నారు.
ప్రభాస్తో తనకు సంబంధం ఉందని సోషియల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని…ఆయనతో తనకు మాట్లాడిన సందర్భాలు కూడా లేవన్నారు. ఆ వ్యక్తిని నా జీవితంలో నేనెప్పుడూ కలవలేదని… ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నారు. ఆ వ్యక్తికి, నాకు ఏ సంబంధమూ లేదు. ఇది నిజం. ఇదే నిజమని నా పిల్లల మీద ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను. లేదు. అలా కాదు… మేం ప్రచారం చేస్తున్నదే నిజమని, ఈ ప్రచారాలు పుట్టిస్తున్నవారు నాలాగా ప్రచారం చేసి చెప్పగలరా? లేదా, నాకు ఈ సంబంధిత వ్యక్తితో సంబంధం ఉందనిగానీ, నేను ఎప్పుడైనా ఈ వ్యక్తిని కలిశాననిగానీ, మాట్లాడాననిగానీ, రుజువులు, ఆధారాలు చూపించగలరా? అంటూ ప్రశ్నించారు.