- Advertisement -
అసెంబ్లీలో గోదావరి జలాల వినియోగంపై చర్చ సమయంలో చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. గోదావరి జలాలపై చర్చ జరుగుతున్న సమయంలో సభానాయకుడు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గురించి ప్రస్తావించారని దాంతో చంద్రబాబు నాయుడు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థం కావడంలేదన్నారు.
ఏపీకి గోదావరి నదీ జలాలు తీసుకురావడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకరిస్తున్నారని, చాలా మంచి వారని అధికారపక్ష నాయకుడు జగన్ అన్నారే తప్ప, చంద్రబాబు నాయుడు చెడ్డవారని అనలేదని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు కంటే కేసీఆర్ వెయ్యిరెట్లు మంచి వారని తాను ఉద్ఘాటిస్తున్నానన్నారు. కేసీఆర్ మంచి వారంటే చంద్రబాబుకు ఎందుకు అంత కడుపు మంట అని ప్రశ్నించారు.