Friday, March 29, 2024
- Advertisement -

బాబు ఇప్పుడు మునగడమేంటి…ఎప్పుడో మునిగిపోయారు..వైసీపీ నేత అంబటి సెటైర్లు

- Advertisement -

కరకట్టమీద లింగమనేని గెస్ట్ హౌస్ ను బాబు ఖాలీ చేయకుండా నానాయాగి చేస్తున్న చంద్రబాబుకు వైసీపీ నేత అంబటి రాంబాబు చురకలు అంటించారు.వరదను అంచనా వేసేందుకు డ్రోన్లను వాడితే చంద్రబాబు అంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు. అక్రమ కట్టడాలకు ముప్పు ముందని రివర్ కన్జర్వేటివ్ బోర్డు ముందుగానే చెప్పింది. చంద్రబాబు రాజకీయంగా ఎప్పుడో మునిగిపోయారు. ఇప్పుడు ఆయన్ను కొత్తగా ముంచాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదని సెటైర్లు వేశారు. వరద ప్రవాహం ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉన్నందున కరకట్టపై ఉన్న ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని చంద్రబాబును ఆయన కోరారు.

ఆంధ్రప్రదేశ్ లో 2009 తర్వాత జలాశయాలు ఈ స్థాయిలో కళకళలాడుతున్నాయన్నారు.ఏపీ ప్రజలు గత ఐదేళ్లలో కరవుకాటకాలతో అల్లాడిపోయారని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వేళావిశేషం కారణంగా కృష్ణా నదికి పదేళ్ల తర్వాత వరద వచ్చిందని చెప్పారు. ఒక వైపు ప్రజలు సంతోషంగా ఉంటె బాబు మాత్రం పట్టరాని కోపంతో ఊగిపోతున్నారని మండిపడ్డారు. 370 రద్దుతో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వచ్చినంత కోపం చంద్రబాబుకు వస్తోందని తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -