Friday, April 26, 2024
- Advertisement -

విజయసాయిరెడ్డి.. కత్తికి రెండు వైపులా పదును

- Advertisement -

విజయసాయిరెడ్డి.. వైసీపీ ఎంపీ.. జగన్ అనుంగ మిత్రుడు.. శ్రేయోభిలాషి.. జగన్ తర్వాత పార్టీలో అంతటి పేరు ప్రఖ్యాతలు కలిగిన వైసీపీ ఎంపీ. అలాంటి నేత తన పార్టీపై.. తన అధినేతపై విమర్శలు వస్తే ఊరుకుంటారా? ఊరుకోడు కదా.. అందుకే ఇప్పుడు పదునైన విమర్శలను తెరపైకి తీసుకొచ్చి ప్రత్యర్థులను చెడుగుడు ఆడేస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా 6 నెలలుకూడా కాలేదు.. మొన్నటి వరకు అధికారం యావతో చెలరేగిన చంద్రబాబు అడ్డ పచ్చమీడియా దీన్ని జీర్ణించుకోవడం లేదు. అందుకే వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ, దాని పచ్చమీడియా, వాళ్ల తెరవెనుక పార్ట్ నర్ అని ఆరోపిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే జగన్ ఒక్కడిని చేసి వీరు చేస్తున్న కుట్రలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ పార్టీకి వెన్నుదన్నుగా ఫైర్ బ్రాండ్ లా విజయసాయిరెడ్డి అడ్డుగోడై నిలుస్తున్నారు.

జగన్ ను విమర్శిస్తున్న వారందరి బండారాన్ని ట్విట్టర్ సాక్షిగా బయటపెడుతూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెడుగుడు ఆడేస్తున్నారు. ‘పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ‘నిత్యకళ్యాణం’.. ‘పవన్ నాయుడు’ లాంటి పద ప్రయోగాలతో ఎండగడుతున్నారు. ఇక లోకేష్ ను ‘పప్పు’ అని.. చంద్రబాబును తీవ్రమైన పదాలతో వెన్నుపోటు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఏకిపారేస్తున్నారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పదప్రయోగాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. చంద్రబాబు, లోకేష్, పవన్ లను వైసీపీ అభిమానులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి. వైసీపీ శ్రేణులకు అండగా ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న విజయసాయిరెడ్డి పదునైన విమర్శలు ఇప్పుడు ప్రత్యర్థుల పాలిట శరాఘాతంగా మారాయని వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -