వైసీపీ తరపున గెలిచినా రఘు రామ కృష్ణ రాజు ప్రస్తుతం బీజేపీ లో అన్ ఆఫీసియల్ ఎంపీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులు గా అయన వైసీపీ నేతలపై చేస్తున్న వైక్యలు ఆయనను పార్టీ నుంచి దూరం అయ్యేలా చేస్తున్నాయి.. స్వయంగా సీఎం జగన్ ఆయనపై ఫోకస్ పెట్టారంటే రాజు గారు ఏ లెవెల్ లో విమర్శించారో అర్థం చేసుకోవచ్చు.. ఢిల్లీ వెళ్లిన ప్రతి సారి జగన్ అక్కడి పెద్దలతో రాజు గారి వ్యవహారం చెప్పి ఆయనను పదవినుంచి దింపే ప్రయత్నం చేస్తున్నారు.. అయితే వైసీపీ నేతలు ఎంత హెచ్చరిస్తున్నా రాజు గారు మారకపోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఇంతకింతకు అయన విమర్శలు ప్రతి పక్ష పార్టీ ని మించిపోతుండడంతో వైసీపీ నేతలు ఆయనను ఏదోకటి చేయాలనీ జగన్ పై వత్తిడి చేయగా ఇటీవలే ఢిల్లీ వెళ్లినజగన్ ఆయనపై మోడీ తో కూడా చర్చించారు.. ఈ మేరకు కొన్ని పరిణామాల దృష్ట్యా రఘు రామ కృష్ణం రాజు మళ్ళీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా తనను అరెస్ట్ చేయించాలని అనుకుంటున్నారని అయన అన్నారు.. ప్రతీ రోజూ రచ్చ బండ పేరుతో ప్రెస్మీట్ పెట్టే ఆయన .. ఈ సారి ఓ వీడియో రిలీజ్ చేశారు. సీఎం జగన్కు అన్నీ తానై వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ అనే అధికారి.. కేంద్ర ఆర్థిక శాఖలో ఉన్న తన బ్యాచ్మేట్ సాయంతో తనపై కేసు పెట్టించారని.. ఎఫ్ఐఆర్ నమోదయ్యేలా చేశారని ఆరోపించారు.
తనను అరెస్ట్ చేయించేవరకూ జగన్ అన్నం తినేలా లేడని సెటైర్ వేశారు. సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకే ప్రవీణ్ ప్రకాష్ని పెట్టుకున్నారని మండిపడ్డారు. అయితే ఆయన రక్షకుడికా కాకుండా జగన్కు తక్షకుడిగా మారారని విమర్శించారు. ఈ నేపథ్యంలో రఘు రామ ఇప్పుడేం చేస్తారో అని ఆసక్తి కరంగా మారింది. తాను జైలు కి వెళ్లకుండా ఉండేందుకు ఎవరిని ఆశ్రయిస్తారో అర్థం కావట్లేదు.. అప్పటికే బీజేపీ సపోర్ట్ ఉన్న రఘు రామ కృష్ణం రాజు కు జగన్ ఇటీవలే ఢిల్లీ టూర్ తో ఇక తనకు బీజేపీ లో ప్రాధాన్యం కోల్పోయినట్లే అని అర్థమైపోయింది.. ఈ నేపథ్యంలో ఈ విషయంలో చంద్రబాబు హెల్ప్ ఏమన్నా తీసుకుంటాడా అనేది చూడాలి..
చంద్రబాబు 40 ఇయర్స్ రాజకీయం ఇదేనా…?
విమర్శల విషయంలో చంద్రబాబు మితి మీరిపోతున్నాడా..?