Wednesday, April 24, 2024
- Advertisement -

జ‌గ‌న్‌పైదాడి :వెలుగులోకి వ‌చ్చిన నిందితుడు ఫోన్ కాల్ రికార్డ్‌

- Advertisement -

వైఎస్సార్‌సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పై దాడికి పాల్పడిన శ్రీనివాస్ ను సిట్ బృందం ప్రత్యేక విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. గత మూడు రోజులుగా అతడిని విచారించడంతో పాటు అతడి నుండి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అయితే అతడు జగన్ పై దాడికి ముందు ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి చెందిన ఓ మహిళతో ఎక్కువసార్లు పోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ ఫోన్ నంబర్ ఆధారంగా సదరు మహిళను గుర్తించిన పోలీసులు ఆమెతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచార‌ణ‌లో మ‌రో కీల‌క స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

జ‌గ‌న్‌పై దాడి చేసేముందు ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి చెందిన ఓ మహిళతో మాట్లాడిన‌ట్లు స‌మాచారం. ప‌ది నిమిషాల్లో జ‌గ‌న్‌ను చంపేస్తామంటూ పోన్‌లో మాట్లాడిన‌ట్లు విచార‌ణ‌లో వెలుగులోకి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. టీవీలో వార్త‌లు చూడాలంటూ పోన్‌ను శ్రీనివాస్ ఫోన్ పెట్టేశాడు. శ్రీనివాస్‌రావు చెప్పిన‌ట్టే చేయ‌డంతో ఆ మ‌హిళ ఎవ‌రికీ ఈ విష‌యాన్ని చెప్ప‌లేద‌ని స‌మాచారం. ఇప్పుడు ఇదే హాట్‌టాఫిక్‌గా మారింది.

తనకు ప్రాణాహని ఉందని, మీడియా వద్దకు తీసుకెళ్లాలంటూ గట్టిగా అరిచాడు. విశాఖ కేజీహెచ్ వద్ధ ఈ ఘటన జరిగింది. జగన్ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం శ్రీనివాసరావును మూడు రోజులుగా ప్రశ్నిస్తున్నా స‌రైన స‌మాధానం రాక‌పోవ‌డంతో పోన్ కాల్ ఆదారంగా విచార‌ణ చేప‌ట్ట‌డంతో అస‌లు నిజాలు వెలుగులోకి వ‌చ్చాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -