- Advertisement -
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటే అందరికీ గుర్తుకొచ్చేది పృథ్వీ. తెలుసు ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. కమెడియన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటినుంచి పార్టీకోసం పనిచేస్తున్నారు. వైఎస్ జగన్ అంటే ప్రాణం. జగన్ మీద పార్టీ మీద ఎవరు కామెంట్లు చేసినా వాటికి కౌంటర్ ఇస్తుంటారు పృథ్వీ.
పృథ్వీ నిబద్దతకు జగన్ పార్టీలో కీలక పదవికి ఎంపిక చేశారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా పృథ్వీరాజ్ను నియమించారు జగన్. కృష్ణా జిల్లాకు చెందిన బలిరెడ్డి పృథ్వీరాజ్ను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.