Thursday, March 28, 2024
- Advertisement -

పార్టీలో ష‌ర్మిల‌కు కీల‌క ప‌ద‌వి ఇవ్వ‌నున్న జ‌గ‌న్‌..

- Advertisement -

రాష్ట్ర‌ప్ర‌జ‌లంతా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎం కావాల‌ని ముక్త ఖంఠంతో కోరుకుంటున్నారు. అన్ని స‌ర్వేలు కూడా వైసీపీకే జైకొట్టాయి. జ‌గ‌న్ సీఎంకావాల‌ని ఎలా ప్ర‌జ‌లు కోరుకుంటున్నారో చెల్లెలు ష‌ర్మిల కూడా అంత‌కంటె ఎక్కువ‌గా కోరుకుంటున్నారు. జ‌గ‌న్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎంత క‌ష్ట‌ప‌డ్డారో అంద‌రికి తెలిసిందే. జ‌గ‌న్ జైల్లో ఉన్న‌ప్పుడు పార్టీకోసం త‌న శాయిశ‌క్తులా కృషిచేసి పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెల్లారు.

ఇక ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా జ‌గ‌న్‌కు అండ‌గా జోరుగా ప్ర‌చారం నిర్వ‌హించారు. అలా మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున కీలకపాత్ర పోషించారు. బైబై బాబు అనే నినాదంతో అధికార‌పార్టీకి చుక్కులు చూపించారు. వైసీపీ అధికారంలోకి వ‌స్తే ..అన్న కోసం అంత క‌ష్ట‌ప‌డ్డ చెల్లికి అన్న ప్రేమ‌తో పార్టీలో ఎలాంటి స‌ముచిత స్థానం క‌ల్పిస్తానె ప్ర‌చారం పార్టీ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది.

జ‌గ‌న్ సీఎం అయితే ష‌ర్మిల‌కు పార్టీలో ముఖ్య ప‌ద‌వి ఇవ్వాల‌ని ఒక వ‌ర్గం ప‌ట్టుబ‌డుతోందంట‌. గ‌తంలో ఒంగోలు లోక్ సభ నుంచి షర్మిల పోటీచేస్తారనే ప్రచారం ఊపందుకుంది. కానీ జగన్ మాత్రం షర్మిలకు సీట్ అవ‌కాశం ఇవ్వ‌లేదు.

ఎన్నిక‌ల్లో టికెట్ ఇవ్వ‌క‌పోయినా పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ క‌వ‌ర్ చేయ‌ని ప్రాంతాల‌ను ష‌ర్మిల చురుగ్గా ప‌ర్య‌టించి పార్టీలో జోష్ నింపారు.”బై..బై బాబు.. బై..బై.. పప్పు” అనే స్లోగన్ ను తెరపైకి తీసుకొచ్చింది ష‌ర్మిల‌నె. ఈ స్లోగ‌న్ యువ‌త‌, ప్ర‌జ‌ల్లోకి మిస్సైల్‌లా దూసుకెల్లింది.

వైసీపీ అధికారంలోకి వస్తే, ప్రభుత్వంలో చోటు కల్పించాల్సిందేనని చాలామంది పట్టుబడుతున్నారు. బాబు సర్కార్ లో లోకేష్, బాలయ్య ఉన్నట్టు.. కేసీఆర్ ప్రభుత్వంలో కేటీఆర్, కవిత ఉన్నట్టు.. జగన్ కొత్త కొలువులో షర్మిల ఉంటే తప్పేంటని వాద‌న పార్టీలో వ్య‌క్తం అవుతోంది. కేబినేట్ విష‌యంలో ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చిన జ‌గ‌న్ ష‌ర్మిల‌కు ఎలాంటి ప‌ద‌వి ఇస్తారో అనే ఆస‌క్తి నెల‌కొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -