- Advertisement -
పోలింగ్కు ఆరు రోజులే సమయం ఉండటంతో ఉధృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. నెల్లూరులో ఎన్నికల ప్రచారం చేసిన ఆ పార్టీ అధినేత జగన్… కొన్ని కీలక ప్రకటనలు చేశారు. ఈసారి కాస్త భిన్నంగా స్పందించారు. రెగ్యులర్ నవరత్న హామీలకు తోడు అదనంగా మరిన్ని హామీలిచ్చారు.
నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం సాగిస్తున్న ఎల్లోమీడియాపై జగన్ విరుచుకు పడ్డారు. రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ బాబు బ్రష్టుపట్టించారన్నారు.పేదల కోసం సొంత డబ్బును ఖర్చుపెట్టే అనీల్ కుమార్ యాదవ్ పై ఆంధ్రోజ్యోతి, టీవీ9, టీవీ5 అమ్ముడుపోయిన మీడియా వ్యవస్థ ఏమని చూపిస్తున్నాయి? అనిల్ ఏదో రాక్షసుడన్నట్టుగా ఓ పథకం, పద్దతి ప్రకారం చిత్రికరిస్తున్నాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.