Friday, March 29, 2024
- Advertisement -

మొద‌టి అసెంబ్లీ స‌మావేశాల్లో బీసీ స‌బ్‌ప్లాన్‌కు చ‌ట్ట‌బ‌ద్ద‌త తెస్తాం…జ‌గ‌న్‌

- Advertisement -

ఏలూరులో వైసీపీ నిర్వ‌హించిన బీసీ గ‌ర్జ‌న‌స‌భ‌లో బీసీల‌కు జ‌గ‌న్ వ‌రాల జ‌ల్లులు కురిపించ‌డంతోపాటు …సీఎం చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే మొద‌టి అసెంబ్లీ స‌మావేశాల్లోనే బీసీ స‌బ్‌ప్లాన్‌కు చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఐదేళ్ల‌లో బీసీల అభివృద్ధికి రూ.75 వేల‌కోట్లు ఖ‌ర్చు చేస్తామ‌ని తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానాల్లో మార్పులు తెస్తామన్నారు. వెనుకబడిన తరగతులు రిజర్వేషన్లు 33 శాతం పెంచుతామని హామీ ఇచ్చారు. 2 లక్షల 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి బాబుకు మనసు రాలేద‌న్నారు.బాబు ఐదేళ్ల పాలనలో రూ. 2,200 కోట్లు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఉన్నాయి. ట్రిపుల్‌ ఐటీ పూర్తి చేసినా రూ. 4,500 మందికి పట్టాలు రాని పరిస్థతి ఉంద‌న్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -