Friday, March 29, 2024
- Advertisement -

టీడీపీ అమరావతి కుట్రలకు వైసీపీ ఇలా చెక్

- Advertisement -

ఏపీ మంత్రి బొత్సా వ్యాఖ్యలు రేపిన మంటలు చల్లారడం లేదు. చంద్రబాబు సహా టీడీపీ నేతలు బొత్సా వ్యాఖ్యలను ఆయుధంగా మార్చుకొని రాష్ట్రాన్ని రావణ కాష్టంలా చేస్తున్నారు. ఇక టీడీపీ మీడియా అయితే అడ్డూ అదుపు లేకుండా చెలరేగిపోతోంది. అయితే ఈ విషయంలో టీడీపీ కుట్రలను ఎండగట్టాలని వైసీపీ యోచిస్తోంది.

ఏపీ మంత్రి బొత్సా అమరావతి ముంపులో ఉందని ఇక్కడ రాజధాని నిర్మాణం కష్టమని తేల్చేయడంతో వైసీపీ ప్రభుత్వం అమరావతిని ఎత్తివేస్తోందని టీడీపీతోపాటు దాని అనుకూల మీడియా అభూత కల్పనలు జోడించి రచ్చ రచ్చ చేస్తోంది.

ఇప్పుడు రాజధాని మార్పు గురించి వివరిస్తూ ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపడుతోంది. ప్రజలు కోరుకుంటున్నదే బొత్సా చెప్పారని.. అది ప్రభుత్వ వైఖరి కాదంటూ తాజాగా ఏపీ మంత్రులు బుగ్గన, కొడాల నాని రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దుతున్నారట..

సీఎం జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇదే అదునుగా ప్రజల మనోభావాలను వెల్లడించిన బొత్సా మాటలను చిలువలు పలువలు చేసి టీడీపీ ఆడేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ట్రబుల్ షూటర్ బుగ్గనతోపాటు ఫైర్ బ్రాండ్ కొడాలి నాని ఇప్పుడు అమరావతి తరలించడం లేదని.. బొత్స కేవలం అక్కడ పరిస్థితులను మాత్రమే వివరించారని చెబుతున్నారు. శివరామకృష్ణ చేసిన సూచనలు మాత్రమే బొత్స చేశారని రాజధాని మార్పు లేదని స్పష్టతనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -