జాతీయ స్థాయిలో బాబును జోకర్లా చూస్తున్నారు…నిప్పులు చెరిగిన రాయచంద్రయ్య
రాష్ట్రంలో టీడీపీ ఓడిపోతుందని సర్వేలు స్పష్టం చేస్తున్నా బాబు మాత్రం ఢిల్లీలో నానాయాగి చేస్తున్నారు. జాతీయ నేతలు ఎవరూ పిలవకున్నా ఈవీఎంలు, వీవీప్యాట్లపై పోరాటం అని ఢిల్లీ వెల్లి రాష్ట్రపరువు తీస్తున్నారని వైసీపీ నేత సి.రామచంద్రయ్య మండిపడ్డారు.సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కూడా చంద్రబాబు వ్యతిరేకించడం సిగ్గుచేటని, చంద్రబాబు రాబోయే ఓటమిని ఈవీఎంలపై నెట్టే యత్నం చేస్తున్నారన్నారు.
రాజ్యాంగ వ్యవస్థకు చంద్రబాబు నాయుడు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారమని ఆరోపించారు. ఐదేళ్లుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేశారని ప్రశ్నించారు.
చంద్రబాబు దేశమంతా తిరిగినా ప్రయోజనం కలగబోదని, ఆయన హుందాతనాన్ని ఏనాడో కోల్పోయారని, అందుకే విపక్షాల సమావేశానికి చంద్రబాబును పక్కకు పెట్టారని ఎద్దేవా చేశారు.చంద్రబాబుకు దేశంలో ఎక్కడ విలువలేదని, ఎంత తిరిగిన ప్రయోజనం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హుందాతనాన్ని కోల్పోయి.. ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.