వైసీపీ మహిళానేత లక్ష్మీపార్వతి బాబు, లోకేష్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కూకట్ పల్లిలో ఓడిపోతామని తెలిసే నందమూరి సుహాసినిని బరిలోకి దింపారని విమర్శించారు. నందమూరి కుటుంబం మరోసారి బాబు చేతిలో మోసపోయిందన్నారు. అవినీతి సొమ్ముతో తెలంగాణ ఓటర్లను కొనే ప్రయత్నం చేశారని… ఓటర్లు మాత్రం ఆయనకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారని చెప్పారు.
రాష్ట్రంలో టీడీపీ నేతల అవినీతి బట్టబయలవుతోందని వైసీపీ నేత లక్ష్మీ పార్వతి అన్నారు. సీఎం రమేష్, సుజనా చౌదరిల బాగోతంతో అది వెలుగులోకి వచ్చిందని, త్వరలోనే లోకేష్ బండారం కూడా బయటపడుతుందని అన్నారు. రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోకుండా కేంద్రం మీన మేషాలు లెక్కిస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతల అవినీతికి హద్దే లేకుండా పోయిందని ఆరోపించారు. రాజధాని నిర్మాణంలో, సాగునీటి ప్రాజెక్టులలో అంతులేని అవినీతి చోటు చేసుకుంటోందని చెప్పారు.