జబర్దస్త్ కామెడీ షోకు అక్కడ ఉన్న యాంకర్స్, కంటెస్టెంట్స్ ఎంత ముఖ్యమో జడ్జీలు కూడా అంతే ముఖ్యం. ఈ కార్యక్రమం ఎంత పాపులారిటీ సంపాదించిందో అందరికి తెలిసిందే. ప్రోగ్రామ్ ఇంతగా సక్సెస్ అయిందంటే కారణం నాగబాబు, రోజానె చెప్పాలి. వాళ్లు లేకుండా ఈ కార్యక్రమాన్ని ఊహించుకోవడం కష్టమే. అక్కడ కామెడీ వచ్చినా లేకపోయినా వాళ్ళ నవ్వులకు ప్రేక్షకులు కూడా అలవాటు పడిపోయారు. అలాంటిది రోజా లేని జబర్ధస్త్ కార్యక్రమాన్ని ఊహించుకోవడం కష్టమే. ఎందుకంటె త్వరలో రోజా కార్యక్రమానికి గుడ్ బాయ్ చెప్పనున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
అసలు విషయానికి వస్తె…ఈ నెల 11 న జరిగిన ఎన్నికల్లో గెలుపుపై వైసీపీ, టీడీపీ ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. గెలుపుపై వైసీపీ పూర్తి విశ్వాసంతో ఉంటె టీడీపీ మాత్రం పైకి మేక పోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇదలా ఉంటె అప్పుడే జగన్ సీఎం అయితే అయితే ఆయన కేబినేట్ లో ఉండేది ఎవరో అన్న అంశంపై చర్చ జోరుగా సాగుతోంది. జగన్ క్యాబినేట్లో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్గా ముద్రపడిన రోజాకి ఖశ్చితంగా స్థానం దక్కుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
పార్టీలో జగన్ తర్వాత రోజానె ముఖ్యం అని చెప్పాలి. అధికార పార్టీ టీడీపీకీ అసెంబ్లీలోను, బయట పదునైన వ్యాఖ్యలతో ధీటుగా జవాబిస్తుంది. మరో వైపు రోజాని చెల్లి అంటూ ఆప్యాయంగా పిలుస్తుంటారని టాక్. అలాగె వైఎస్ హయాంలో కూడా క్యాబినేట్లో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇప్పుడు జగన్ కూడా రోజాను తన క్యాబినేట్లోకి తీసుకుంటారని తెలుస్తోంది.
వైసీపీ అధికారంలోకి వస్తె రోజాకు హోమంత్రి పదవి ఇస్తారనె వార్తలు గతంలో హల్ చల్ చేసిన సంగీతి తెలిసిందే.అయితే అందరూ అనుకున్నట్టుగా హోం శాఖను కాకుండా సినిమాటోగ్రఫీ,మహిళా శిశు సంక్షేమ శాఖ బాద్యతలను అప్పగిస్తున్నారట. మరో ప్రక్క రోజాకూడా తన ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మంత్రిగా అవకాశం వస్తె జబర్దస్త్ కార్యక్రమంలో జడ్జీగా వ్యవహరించడం ఇబ్బందిగా మారనుంది. అందుకే రోజా కార్యక్రమానికి గుడ్ బాయ్ చెప్తునున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఫలితాల రోజు రోజా పరిస్థితి తలక్రిందులవుతుందా లేకా అందరూ అనుకున్నట్లుగానె గెలిచి జగన్ క్యాబినేట్లో మంత్రిగా కొనసాగుతుందో చూడాలి.