Friday, April 19, 2024
- Advertisement -

చంద్రబాబుకు చురకలు అంటించిన అంబటి రాంబాబు…

- Advertisement -

పదే పదే జగన్ ను టార్గెట్ చేస్తున్న మాజీ సీఎం చంద్రబాబకు వైసీపీ నేత అంబటి చురకలు అంటించారు. పాలన మెచ్చుకోక పోయినా…బురద చల్లడం మానుకోవాలని హితవు పలికారు. 2017లో తెలంగాణలో జరిగిన ఆందోళనకు సంబంధించిన ఆశా వర్కర్ల ఫొటోను చంద్రబాబు పోస్ట్ చేశారని విమర్శించారు.

బాబు చేసిన అబద్దాల ప్రచారం వల్లే ఆ పార్టీకి 23 సీట్లు వచ్చాయని ఎద్దేవ చేశారు. చంద్రబాబు పాలిచ్చే ఆవు కాదని, రక్తాన్ని పీల్చే జలగ అని విమర్శించారు. తమ దేశంలో చంద్రబాబులా మాట్లాడితే మెంటల్‌ ఆసుపత్రిలో వేస్తారని స్విట్జర్లాండ్‌ మంత్రి ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు.

గత ప్రభుత్వంలో చంద్రబాబు 23 మందిని కొనుగోలు చేసి వైఎస్సార్‌ సీపీని లేకుండా అంతం చేస్తానని బెదిరించారన్నారు. అయితే జగన్‌.. వెనకడుగు వేయకుండా పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లారని తెలిపారు. ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చి కనుమరుగైపోయినా.. వైఎస్సార్‌ సీపీ మాత్రం వెనుతిరగలేదని, జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల ఆశీస్సులు ఉండటమే ఇందుకు కారణమని స్పష్టం చేశారు. బందరు పోర్టు తెలంగాణకు ఇచ్చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -