Friday, March 29, 2024
- Advertisement -

బాబుగారు మీకు సిగ్గు అనిపించడంలేదా…? అంబటి రాంబాబు

- Advertisement -

మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరో సారి తనదైన శైలిలో రెచ్చిపోయారు.చంద్రబాబు పాలనలో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన అంబటి… ప్రజాధనం ఆదా చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంటె బాబుకు ఎందుకు మండుతుందే చెప్పాలని ప్రశ్నించారు.దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులను అడ్డుకున్నట్లు, జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

రివర్స్ టెండరింగ్ ద్వారా అవినీతిని అరికడతామని సీఎం జగన్ చెప్పారని… ఆ ప్రక్రియ విజయవంతమైందని అంబటి వ్యాఖ్యానించారు.దీని ద్వారా ప్రభుత్వానికి రూ.. 780 కోట్ల ప్రజా ధనం ఆదా అయ్యిందన్నారు.పీపీఏ ద్వారా ఏడాదికి రూ.2500 కోట్ల నష్టాన్ని ప్రభుత్వం భరిస్తోందని, దాన్ని ఆదా చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. గతంలో చంద్రబాబు పీపీఏల్లో వందల కోట్లు కమీషన్‌ పేరుతో నొక్కేశారని విమర్శించారు.

చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీకి జగన్మోహన్ రెడ్డికి ఏమి సంబంధమని అంబటి ప్రశ్నించారు. లింగమనేని గెస్ట్ హౌస్‌లో చంద్రబాబు ఎందుకు ఉన్నారని అంబటి ప్రశ్నించారు.40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబుకు అక్రమ ఇంట్లో ఉంటున్నా సిగ్గు అనిపించడం లేదా ? అని ధ్వజమెత్తారు. సుజనా చౌదరి కమల వనంలో ఉన్న పచ్చ పుష్పమని అంబటి ఎద్దేవా చేశారు.

ప్రభుత్వంపై విషం కక్కేందుకు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ ప్రయత్నిస్తున్నారని, వారికి కొన్ని పత్రికలు వంత పాడుతున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో అందరం చూశామని, చంద్రబాబుకు 23 సీట్లు ఇచ్చి ఓ మూలన కూర్చోబెట్టినా బుద్ధి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -