Friday, March 29, 2024
- Advertisement -

ద‌మ్ముంటె 21 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించు.

- Advertisement -

టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ మ‌హిళానేత రోజాపై చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం రేపుతున్నాయి. నంద్యాల ఉప ఎన్నిక మొద‌ల‌యిన రెండు నెల‌ల‌నుంచి నంద్యాల్లో మకాం పెట్టి.. టీడీపీ తరపున ప్రచారం చేస్తున్న ఈ నేత చివరి రోజు ప్రచారం నేపథ్యంలో ఈ సవాలు విసిరాడు. టీడీపీ ఓడిపోతె నేను గుండు కొట్టించుకుంట ….మ‌రి వైసీపీ ఓడిపోతె రోజా గుండు కొట్టించుకుంటా అని సవాలు చేయడం హాట్‌పాఫిక్‌గా మారింది.

బోండా ఉమా వ్యాఖ్యలకు రోజా గట్టి కౌంటర్ ఇచ్చారు. నంద్యాలలో ప్రచారం నిర్వహించిన ఆమె… ” టీడీపీకి ప్రచారం చేసేందుకు మనుషులు కూడా దొరకడం లేదు. ”వాడు బోండా ఉమా వచ్చాడు. వైసీపీ ఓడిపోతే రోజా గుండు కొట్టించుకుంటుందా అంటున్నాడు. వాడికి టీడీపీ గెలుపు మీద అంత నమ్మకమే ఉంటే ఇంత మంది మంత్రులను ఎందుకు తెచ్చారు. చంద్రబాబు, బాలకృష్ణ ఇక్కడికి వచ్చి ఎందుకు దొర్లుతున్నారు. గుండు కొట్టించుకునే సవాల్‌కు నేను రెడీ. 21 మంది ఎమ్మెల్యేల చేత కూడా రాజీనామా చేయించండి. అప్పుడు తేలిపోతుంది ఎవరు గుండు కొట్టించుకుంటారో అంటూ స‌వాల్ విసిరింది.

సోంబేరి సోమిరెడ్డిని నెల్లూరు ప్రజలు ఐదు సార్లు ఓడగొట్టి నీవు పనికిరావు ఇంట్లో కూర్చోరా బాబూ అంటే ఇప్పుడు నంద్యాల వచ్చి వైసీపీని ఓడించండి అని పిలుపునిస్తున్నారని ఎద్దేవా చేశారు రోజా. మరో మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి ఎప్పుడూ మీసాలు తిప్పుకుంటూ తిరుగుతుంటారని… మీసాలు తిప్పడంకాదు వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే అప్పుడు రోశం, పౌరుషం ఉన్నట్టు ఎవరైనా నమ్ముతారని రోజా వ్యాఖ్యానించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -