ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజా బాబుపై విరుచుకు పడ్డారు. అధికారంకోసం బాబు ఏగడ్డి అయినా తింటాడని….ఆఖరికి గాడిద కాళ్లు కూడా పట్టుకోడానికి వెనుకాడరని సెటైర్లు వేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు.. బీజేపీ,పవన్ తో జతకట్టారని.. ఈ ఎన్నికల నాటికి కాంగ్రెస్ తో జోడి కుదుర్చుకున్నారని మండిపడ్డారు.
2014 ఎన్నికల సమయంలో 600 అబద్దపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చి పచ్చ మీడియాతో మ్యానేజ్ చేస్తున్న బాబును ప్రస్తుతం నమ్మేస్థితిలో ప్రజలు లేరన్నారు. పవన్కల్యాణ్తో పొత్తు పెట్టుకుంటే వైఎస్సార్సీపీకి ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. టీడీపీ, పవన్ అసలు విడిపోతే కదా పొత్తు గురించి మాట్లాడేందుకని ఆమె ఎద్దేవా చేశారు.
చంద్రబాబుకు ఫైనాన్షియర్గా ఉన్న లింగమనేని ప్రస్తుతం పవన్ కల్యాణ్కు ఫైనాన్షియర్గా ఉన్నారని, టీడీపీ, జనసేనకు మధ్య ఉన్న బంధానికి ఇంతకుమించి సాక్ష్యాలు అవసరం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికీ పవన్.. టీడీపీతో రహస్య పొత్తు కొనసాగిస్తున్నారన్నారు.