Friday, March 29, 2024
- Advertisement -

బాబును చూస్తె అబద్ధానికి కూడా సిగ్గేస్తుంది…

- Advertisement -

మహాత్ముడి జయంతి రోజున కూడా మద్యం అమ్మకాలు జరిగాయని బాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ మహిళా ఎమ్మెల్యే విడదల రజిని. గాంధీ జయంతి రోజున కూడా మద్యం విక్రయాలు చేశారని చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని ఆమె మండిపడ్డారు. బాబు మాట్లాడే అబద్ధాలు చూస్తె సిగ్గు కూడా సిగ్గుపడుతుందని ఎద్దేవ చేశారు.

గాంధీ జయంతి రోజున మద్యం అమ్ముతున్నారని, పోలీసుల ద్వారా మద్యం సరఫరా చేస్తున్నారని వ్యాఖ్యానించడం దారుణమన్నారు. అబద్ధాలు చెప్పడం బాబు నైజమన్నారు.వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న బెల్టు షాపులను రద్దు చేశారని తెలిపారు. మొత్తంగా 20 శాతం మద్యం షాపులు తగ్గించారన్నారు. ప్రమాణ స్వీకారం రోజున బెల్టుషాపులు రద్దు చేస్తామని చెప్పి సంతకం చేసిన చంద్రబాబు మాట తప్పారని.. ఆయన హయాంలో మద్యం ఏరులై పారిందని మండిపడ్డారు.

మద్యం విక్రయాలు జరిగితే ఆయన నిరూపించాలని సవాల్ చేశారు. ఎక్కడ కనిపించింది? మద్యం విక్రయాలు ఎక్కడ జరిగాయో చెప్పాలని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో మద్యం ఏరులై పారిందని, ఉదయం, రాత్రి తేడా లేకుండా మద్యం షాపులు తెరిచే ఉండేవన్నారు.ప్రభుత్వ విధానాలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న చంద్రబాబుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి’ అని విడదల రజిని కోరారు. అదే విధంగా గ్రామ సచివాలయాలను తీసుకురావాలని భావించిన గాంధీ సిద్ధాంతాన్ని అక్టోబరు 2న సీఎం జగన్‌ అమలు చేశారని ప్రశంసించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -