నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై వైసీపీ ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తున్నారు. ఆయనపై పోలీసు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే మంత్రి శ్రీరంగనాథరాజు ఫిర్యాదు చేయగా.. ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, ప్రసాదరాజు కూడా అదే దారిలో నడిచారు. గ్రంధి శ్రీనివాస్ భీమవరం పోలీసులకు ఎంపీపై ఫిర్యాదు చేశారు. తన సహచా ఎమ్మెల్యేలను అసభ్య పదజాలంతో దారుణంగా కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పార్టీలో గొడవలు జరిగేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఇటు నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు కూడా ఫిర్యాదు చేశారు. అలానే ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలు కారమూరి నాగశ్వేరరావు, కొట్టి సత్యనారయణ కూడా ఫిర్యాదుకు రెడీ అయ్యారు. ఇళ్ల పట్టాలు, ఇసుక విషయంలో మంత్రి, పార్టీ ఎమ్మెల్యేలపై ఎంపీ రఘురామ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇళ్ల కేటాయింపుల్లో గోల్ మాల్ జరుగుతుందని.. అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. అలానే ఇసుక మాఫియా వెనుక ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు.
గతంలో ఈ వ్యాఖ్యలపై దూమారం రేగింది. వైసీపీ నేతలు బతిమాలితే తాను వైసీపీలో చేరానని అన్నారు. మంత్రి శ్రీరంగనాథరాజుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత రఘురామకు పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీనిపైనా అభ్యంతరం చెబుతూ ఎంపీ కౌంటర్ ఇచ్చారు.. అలాగే అధినేత జగన్కు కూడా లేఖ రాశారు. ఆ వెంటనే వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. రఘురామపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఇటు ఎంపీ కూడా హైకోర్టులో పిటిషన్ వేయగా.. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఫిర్యాదులతో షాకిస్తున్నారు.
వైఎస్సార్ కు జగన్ నివాళులు.. భర్తపై పుస్తకం రాసిన వైఎస్ విజయమ్మ..!
అంబులెన్స్ నడిపిన ఎమ్మెల్యే రోజా.. వీడియో..!