Friday, March 29, 2024
- Advertisement -

సుజనా చౌదరి డూప్లికేట్‌ బీజేపీ నేత..

- Advertisement -

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ బాలశౌరి సుజనా చౌదరి వైఖరిపై మండిపడ్డారు. సుజనాకు సూటిగా ప్రశ్నలు సంధించారు. సుజనా బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా..? మీకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా..? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా..? ప్రధానమంత్రి నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ధర్మదీక్షలు చేసింది నువ్వు కాదా సుజనా అని ప్రశ్నించారు.

సుజనా డూప్లికేట్‌ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నాడన్నారు. పొలిటికల్‌ బ్రోకర్, డూప్లికేట్‌ బీజేపీ నేత సుజనా మాటలకు విలువ లేదన్నారు. సుజనా చౌదరిపై ఎథిక్స్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తానన్నారు.

ఇప్పటికే జీవీఎల్‌ కూడా సుజనాపై ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్‌లో ప్రైవేట్‌ బిల్లు పెడతామన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -