Thursday, April 25, 2024
- Advertisement -

చంద్ర‌బాబుగారు చూస్తున్నారా జ‌గ‌న్ పాల‌న‌…

- Advertisement -

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్‌లో మాజీ సీఎం చంద్ర‌బాబుపై మ‌రో సారి రెచ్చిపోయారు. మొద‌టి నుంచి బాబుకు నిద్ర‌లేకుండా చూస్తున్న విజ‌య‌సాయి ట్విటర్ వేదికగా మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు . సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చార‌న్నారు.

అధికారం అంటే దోచుకోవడం, దాచుకోవడమేనని పచ్చపార్టీ వాళ్లు అనుకున్నారు. అందుకే ప్రజలు వారిని తరిమి కొట్టారు. మనం మాత్రం దీన్నొక పవిత్ర బాధ్యతగా భావించాలి. ప్రజలిచ్చిన అఖండ మెజారిటీ వారికి సేవ చేసేందుకు మాత్రమే అని అర్థం చేసుకోవాలి. జగన్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి అంటూ ట్వీట్ చేశారు.

రాష్ట్రంలోకి సీబీఐ అడుగు పెట్ట‌కుండా తీసుకున్న చ‌ర్య‌ల‌పై కూడా స్పందించారు. మీరు సీబీఐ రాకుండ బ్యాన్ చేశారు…కాన జ‌గ‌న్ రెడ్ కార్పెట్ ప‌రిచారు. సీబీఐని రాష్ట్రంలోకి అనుమతిస్తూ జగన్ గారు ఆదేశాలు జారీ చేశారు. దొంగలను రక్షించేది లేదని తేల్చిచెప్పారు. చూస్తున్నారా చంద్రబాబూ?’ అంటూ విజయసాయి వరుస ట్వీట్లు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -