Tuesday, April 16, 2024
- Advertisement -

కోడెల ఈవెంట్ మేనేజ్ మెంట్… బాబుపై విజయసాయి సెటైర్లు

- Advertisement -

కోడెల ఆత్మహత్య వ్యవహారంపై ఎంత రచ్చ చేయాలో అంత చేసిన చంద్రబాబుకు ఎల్లోమీడియా ఎంతో సహకరించిందని.. వీరిద్దరూ కలిసి చేసిన కోడెల అంత్యక్రియల ఈవెంట్ మేనేజ్ మెంట్ స్కిల్స్ అద్భుతంగా ప్రదర్శించారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.

పల్నాటి పులి అంటూనే కోడెలను తీవ్ర క్షోభకు గురిచేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ విజయసాయిరెడడ్ి విమర్శలు గుప్పించారు. అంతకుముందు వర్ల రామయ్య సహా అందరినీ జగన్ ప్రభుత్వంపై ఉసిగొల్పారని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఎల్లోమీడియాను ఎంత కావాలో అంత వాడుకొని కోడెల ఉదంతంలో తమ ప్రభుత్వంపై విమర్శలు చేశారంటూ విజయసాయి మండిపడ్డారు.

ఇక సచివాలయ ఉద్యోగుల పేపర్ లీకేజీ అంటూ చంద్రబాబు, ఎల్లో మీడియా నానా యాగీ చేయడంపై విజయసాయిరెడ్డి కౌంటర్లు ఇచ్చారు. పరీక్ష రాసిన అభ్యర్థులతో ఫిర్యాదు చేయాలని ఎల్లో మీడియా వెతికినా ఎవరూ చేయలేదని.. ఇక చంద్రబాబే దీనిపై ప్రశ్నాపత్రం లీక్ అంటూ ఉసిగొల్పిందని విజయసాయిరెడడ్ి మండిపడ్డారు. మీలాంటి జ్ఞాని అలా అనకపోతే ఆశ్చర్యపోవాలి అంటూ సెటైర్లు వేశారు..

ఇక బాబు 1983లో టీచర్లకు ఉద్యోగం ఇచ్చి నెలకు 398 మాత్రమే వేతనంగా ఇచ్చి ఏళ్ల తరబడి తిప్పించిన వైనాన్ని విజయసాయిరెడ్డి ఎత్తి చూపారు. తాము ఒకేసారి 4 లక్షల మంది గ్రామ సచివాలయ ఉద్యోగులను నియమిస్తుంటే మీ ముఠా కళ్లలో నిప్పులు పొసుకుంటోంది అని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -