Friday, March 29, 2024
- Advertisement -

చంద్రబాబుపై మరోసారి ఫైర్ అయిన ఎంపీ విజయసాయి రెడ్డి

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చేస్తున్న విమర్శలపై విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందిస్తూ ట్విట్లు చేశారు. జగనేడాది పాలన ’ట్రైలర్’ కే కలుగులో దాకున్న ఎలుకలా హైదరాబాద్ లో గడుపుతున్న చంద్రబాబు వచ్చే నాలుగేళ్ళలో అసలు సినిమా చూసి ఏమవుతారో అంటూ కౌంటర్లు వేశారు.

అనుభజ్ఞుడని గెలిపించిన ప్రజలను ఎంగిలి విస్తరాకుల్లా విసిరేసి, దోపిడీలు, స్కాములు చేస్తూ దొరికి పోయారు.. దొంగల ముఠా జైలుకెళ్లాల్సిందే అన్నారు. మరో ట్వీట్‌లో.. చిట్టి మాలోకం చిన్న మెదడు పూర్తిగా చితికిపోయినట్లుంది. వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది బాబు హయాంలోనే.. తొమ్మిదేళ్ల వరస కరువును ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. మేత దొరకక పశువులను కబేళాలకు అమ్ముకున్న దయనీయ దృశ్యాలను ప్రపంచమంతా చూసిందని.. రాజన్న రాకతోనే వ్యవసాయం పండగలా మారింది అన్నారు.

ఇక ఇది ఇలా ఉంటే విజయ్సాయి రెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్ ఏడాది పాలన ట్రైలర్ మాత్రమే అంటున్నారు మామ విజయసాయిరెడ్డి.. నిజమే ట్రైలర్‌కే ఎంపీలు జంప్, మంత్రుల అసంతృప్తి, ఎమ్మెల్యేలు ధర్నాలు, నిరసనలు. ఇక అసలు బొమ్మ పడితే యుశ్రారైకాపా ఖాళీ.. మామా, అల్లుడికి చంచల్ గూడా జైలులో చిప్పకూడు ఖాయం అంటూ కాస్త ఘాటుగా ట్వీట్ చేశారు.

కేసీఆర్ కంటే జగనే బెటర్ : ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఎంపీ రఘురామకు ఊహించని షాక్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు..!

ఎవరికి తెలియని విషయాలు ఈ పుస్తకంలో ఉంటాయి : వైఎస్ షర్మిల

జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. అన్ని ఆసుపత్రిల్లో కరోనా ఉచిత చికిత్స..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -