Friday, March 29, 2024
- Advertisement -

బాబు ఆక్షింతలతోనే నాపై ఆంధ్రజ్యోతి కొత్త కథనం

- Advertisement -

భూకంపం సృష్టిస్తానని ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. తీరా అక్కడికి వెళ్లి మోడీ వద్ద ఒంగిఒంగి దండాలుపెట్టారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. మోడీ చేయి పట్టుకుని చంద్రబాబు నవ్విన వెకిలినవ్వులు అందరూ చూశారన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానన్న చంద్రబాబు.. మోడీ ఎదురైనప్పుడు ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. ఈసారి ధర్మపోరాట దీక్ష అంటూ చంద్రబాబు వస్తే మోడీతో వెకిలినవ్వుల ఫోటోచూపించి నిలదీయాలని ప్రజలకు సూచించారు. మోడీతో ఫోటోలపై వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుందనే చంద్రబాబు మీడియా సమావేశం కూడా రద్దు చేసుకుని పారిపోయారని విమర్శించారు.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సర్వే నిజం కాదని రోజా విమర్శించారు. నగరిలో రోజా గెలుస్తుందని తొలి రోజు చెప్పిన ఆంధ్రజ్యోతి.. చంద్రబాబు నుంచి ఆక్షింతలు పడగానే నగరిలో వైసీపీ బలంగా ఉంది గానీ రోజా అయితే కష్టమంటూ కొత్త కథనాన్ని రాసిందని రోజా విమర్శించారు. దీన్ని బట్టే ఆ సర్వే ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చన్నారు. టీడీపీ వాళ్లు ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేక రోజా జనసేనలోకి పోతోందంటూ ప్రచారం చేసుకుంటున్నారని రోజా మండిపడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -