Thursday, April 18, 2024
- Advertisement -

ఎన్నిక‌ల స‌మ‌ర శంఖారావాన్ని మొద‌లు పెట్టిన వైసీపీ..

- Advertisement -

త్వ‌ర‌లో ఏపీలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌కు వైసీపీ స‌మ‌ర‌శంఖారావం పూరించింది. పాద‌యాత్రు ముగిసిన త‌రువాత మ‌రో కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బ‌లోపేతం చేసేందుకు వైసీపీ అధినేత జగన్ బూత్ క‌మిటీల‌తో సమావేశాలు నిర్వ‌హిస్తున్నారు.ఫిబ్రవరి 6 బుధవారం నుంచి స‌మ‌ర‌ శంఖారావం పేరుతో జిల్లాల వారిగా బూత్ క‌మిటీలతో స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్నారు. స‌మ‌ర శంఖారావం మెద‌టి విడ‌త‌లో బాగంగా ఐదు జిల్లాల్లో ప‌ర్య‌ట‌నలు ఉండే విధంగా ప్లాన్ చేశారు.

క్షేత్ర స్థాయిలో పార్టీ ప్ర‌జ‌ల్లోకి వెల్లాలంటే ఏ రాజ‌కీయ పార్టీకైనా బూత్ క‌మిటీలు బ‌లంగా ఉండాలి. అయితే గ‌త ఎన్నిక‌ల్లో వాటి బ‌ల‌హీన‌త వ‌ల్లే న‌ష్ట పోయిన వైసీపీ ఈసారి ఆ త‌ప్పు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది.ఇందులో బాగంగా స‌మ‌ర శంఖారావం పేరుతో బూత్ క‌మిటీలతో అధినేత జ‌గ‌న్ స‌మావేశ‌మ‌వనున్నారు.

ఫిబ్రవరి 6 బుధవారం నుండి ఈ కార్య‌క్ర‌మం ప్రారంభిస్తున్నారు వైసీపీ అధినేత జ‌గ‌న్. మెద‌టి విడ‌త‌లో ఐదు జిల్లాల్లో ఈ స‌మావేశాలు నిర్వ‌హించనున్నారు. మెద‌ట‌గా 6వ తేదీన తిరుప‌తిలో బూత్ క‌మిటీల‌తో జ‌గ‌న్ స‌మావేశం అవుతారు. రేణిగుంట‌ యోగానంద ఇంజినీరింగ్‌ కళాశాల ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. దీని కంటే ముందు

జగనన్న పిలుపు’అనే కార్యక్రమంలో భాగంగా తటస్తుల‌తో ఉద‌యం 11 గంట‌ల‌కు త‌నప‌ల్లి క్రాస్‌లోని పీఎల్ఆర్ గార్డెన్స్‌లో స‌మావేశం అవుతారు. త‌ర్వాత 1 గంట‌కు స‌మ‌ర‌ శంఖారావం స‌భ‌కు జ‌గ‌న్ హ‌జ‌ర‌వుతారు. 7 వ తేదీన క‌డ‌ప‌, 11 అనంత‌పురం, 12 నెల్లూరు, 13న ప్ర‌కాశం జిల్లాల్లో సమర శంఖారావ సమావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. మెద‌ట విడ‌త స‌భలు ముగిసిన త‌రువాత రెండ‌వ విడ‌త ప్రారంభంకానుంది. ఇలా 13 జిల్లాల్లో జగన్ ఈ స‌భ‌లు నిర్వ‌హించ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -