కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఖడ్గం సినిమాలో ఒకే ఒక్క ఛాన్స్ అనే డైలాగ్తో ఫాపులర్ అయిన నటి సంగీత. ఖడ్గం మూవీ తర్వాత పెళ్ళాం ఊరెళితే, సంక్రాంతి వంటి చిత్రాలలో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళంలో కూడా పలు సినిమాల్లో నటించిన సంగీత 2009లో సింగర్ క్రిష్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
క్రిష్ సింగరే కాదు మంచి నటుడు కూడా. వీరికి ఒక పాప కూడా ఉంది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పేసి సంగీత చాలా కాలం తర్వాత తమిళంలో పెళ్లిచూపులు షో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. సంక్రాంతి కానుకగా వస్తున్న మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా తెలుగు తెరకు రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లో సంగీత, రష్మీక, మహేష్ బాబు మధ్య ట్రైన్ లో కామెడీ సీన్స్ అందరినీ బాగా ఆకట్టుకోనున్నాయని తెలుస్తోంది.
ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగీత సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకులు ఎలా ఆకట్టుకోబోతుందో చూడాలి. ప్రస్తుతం సంగీత సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్గా పాల్గొంటోంది. దాదాపుగా పది సంవత్సరాల విరామం తర్వాత వస్తున్న ఆమె మరిన్ని సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం.
చంద్ర టీంలో ఉండే ఈమె గురించి షాకింగ్ నిజాలు..!
కృష్ణం రాజు కూతుర్లు ఏం చదువుతున్నారంటే ?