Thursday, April 25, 2024
- Advertisement -

మధ్యాహ్నం పడుకుంటున్నారా ?

- Advertisement -

మాములుగా చాలా మంది మధ్యాహ్నం నిద్రపోతుంటారు. కొన్ని రకాల పనుల కారణంగా.. బాగా ట్రెస్ ఫీల్ అయ్యి, అలానే పొద్దునే ప్రారంభమైన పనులు కారణంగా చాలా మంది మధ్యహ్నం కాసేపు నిద్రపోతుంటారు. ఇలా కాసేపు నిద్రపోవడం వల్ల శరీరం రిఫ్రెష్ మెంట్ అవుతుంది. అలానే యాక్టివ్ గా ఉండటానికి అవకాశం ఉంది. సాయంత్రం, రాత్రి సమయం వరకు పని చేసే వాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతోంది. ఎప్పుడైన మన శరీరం అలసటకు లోనవుతుందో అప్పుడు కచ్చితంగా ఒక గంట నిద్రపోవడం మంచింది. అలానే మనం తీసుకున్న ఆహారం అరుగుదలకు కూడా నిద్ర సహాయపడుతుంది.

అలానే మధ్యాహం కాసేపు నిద్రించడం వల్ల ఎక్కువ సమయం పని చేయడానికి వీలుంటుంది. అలానే మధ్యాహ్న నిద్ర వలన బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది. గుండే మీద ఒత్తిడి కూడా తగ్గిచేస్తుంది మధ్యాహ్నం గంటన్నర నిద్రపోయే అలవాటు చేసుకుంటే, నరాల కదలిక బాగా ఉంటుందట. మధ్యాహ్నం నిద్రపోయేవారిపై ఒక రీసెర్చ్ చేసి స్టెట్‌మెంట్ ఇచ్చారు డాక్టర్లు. ఈ పరిశోధనల్లో బాగంగా ఆమెరికా సైనికులపై అధ్యయనం చేశారు. మధ్యాహ్నం నిద్రకు అలవాటైన సైనికులు కదలికలు, అలవాటు లేని సైనికుల కదలికలు కంటే చురుగ్గా ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినేవారు ఈ మధ్యాహ్నం నిద్రకి దూరంగా ఉంటేనే మంచిదట

మంచి నిద్ర వల్ల చాలా ఆరోగ్యకరమైన జీవితం లభిస్తోంది. మాములుగా 5-7 గంటల పాటు నిద్ర చాలా అవసరం అని నిపుణులు చెబుతున్నారు. అలానే బరువు పెరగడానికి నిద్రకు కుడా లింక్ ఉందట. రోజులో వ్యవధిలో 5 గంటల కంటే తక్కువ, 9 గంటల కంటే ఎక్కువ నిద్రించేవారు త్వరగా బరువు పెరుగుతారని తాజా అధ్యయనాలు తెలిపాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -