Wednesday, April 24, 2024
- Advertisement -

షాకింగ్……. జగన్‌పై ఆ స్థాయిలో కుట్ర…… బయటపెట్టిన నిఘా

- Advertisement -

జగన్‌పై హత్యాయత్నం, వివేకానందరెడ్డి హత్యతో పాటు ఎక్కడికక్కడ వైకాపా నేతలు, కార్యకర్తలపై ఎలాంటి దాడులు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. రౌడీ రాజ్యం, ఫ్యాక్షన్ రాజ్యం అంటూ ఆరోపణలు చేస్తూ అసలు హత్యా రాజకీయాలు మాత్రం వాళ్ళే చేస్తూ మీడియా మేనేజ్‌మెంట్‌తో ప్రత్యర్థులను కార్నర్ చేస్తున్న రాజకీయాన్ని చూస్తూ ఉన్నాం. అలాంటి మరో రాజకీయ కుట్ర ఇప్పుడు బయటపడింది. అమరావతిలో నివాసం ఉండడానికి అన్నీ సిద్ధం చేసుకున్న జగన్‌కి చంద్రబాబు ప్రభుత్వం మొదటి రోజే సూపర్ షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఈ షాకింగ్ విషయం గురించి పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చలు నడుస్తున్నాయి. ఈ రాజకీయాన్ని చూసి టిడిపి నాయకులు కూడా రేపు మా విషయంలో కూడా ఇలానే చేస్తారేమో అన్న భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

తాడేపల్లిలో వెఎస్ జగన్ ఇటీవల గృహ ప్రవేశం చేసిన తర్వాత అక్కడ నివాసం ఉండకుండా తిరిగి హైదరాబాద్ వెళ్లిపోవడంపై పెద్ద చర్చే జరిగింది…

ఎన్నికల సమయంలో ఆయన అలా అర్థాంతరంగా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఇప్పుడిపుడే కారణాలు బయటకు వస్తున్నాయి..

నిర్మాణం పూర్తి అవుతున్నదశలోనే ఇంటి చుట్టూ కిలో మీటర్ పరిధిలో నాలుగు హైపవర్ ఫోన్ ఇంటర్ సెప్టర్లు పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఇంటర్ సెప్టర్ల ద్వారా పార్టీ ఆఫీసు, ఇంటికి వచ్చే ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ అన్నిటిని వినొచ్చు, రికార్డు చేయొచ్చు.

వైఎస్సార్ సిపి అభిమానులైన కొందరు సాంకేతిక నిపుణులు వీటిని గుర్తించిన తర్వాత జగన్ ను అక్కడి నుంచి కార్యకలాపాలు సాగించొద్దని సూచించారట. దానితో తిరిగి హైదరాబాద్ లోటస్ పాండ్ కు వెళ్లాల్సి వచ్చింది.

  • ఇంటర్సెప్టర్లను ఎలా గుర్తించొచ్చంటే…
  • ఇయర్ ఫోన్ సాకెట్ నుంచి లౌడ్ స్పీకర్లకు కనెక్ట్ చేసినప్పుడు ఎలక్ట్రానిక్ పరికరమేదో నియంత్రిస్తున్నట్టు జుయ్ మనే డిస్ట్రబెన్స్ సౌండ్ వినిపిస్తుంది.
  • ఫోన్ వాడకున్నా కూడా దానికదే స్క్రీన్ లైట్ వెలుగుతుంది.
  • బ్యాటరీ తొందరగా డౌన్ అవుతుంది.
  • ఫోన్ వేడెక్కుతుంది.
  • రిసీవింగ్ కాల్స్ స్పష్టంగా వినిపించవు.

ఇవి కాకుండా యాంటీ సర్వైలెన్స్ పరికరాల ద్వారా ఖచ్చితంగా ఇంటర్ సెప్టర్లను గుర్తించ వచ్చు. అవి ఎంత దూరంలో ఉన్నాయి. ఒక దగ్గర స్టాటిక్ గా ఉన్నాయా. వాహనాల్లో ఉంచిన మొబైల్ పరికరాలా అన్నది తెలుసుకోవచ్చు.

ఇంటర్ సెప్టర్ ఆపరేషన్లు ఎలా ఉంటాయంటే సబ్జెక్ట్ ఎటు వెళ్తే అటు అనుసరిస్తాయి. రూట్ మ్యాప్ ముందే తెలుసుకొని 10-20 కి.మీ కొక మొబైల్ ఇంటర్ సెప్టర్ను సిద్ధంగా ఉంచుతారు. జిఎస్ఎం, 3జి,4జి ఫోన్లకు ప్రత్యేక మాడ్యూల్స్ ఉంటాయి…

టెక్నాలజీ ముఖ్యమంత్రిని అని చెప్పునేవాళ్ళ పనితనం చూశారుగా. నీడను కూడా నమ్మని జనాలు ప్రతిపక్ష నాయకుడిపై ఆ స్థాయిలో కుట్రపన్నారు. అయితే ఈ కుట్ర వ్యవహారం ఇప్పుడు టిడిపి నాయకుల్లోనే భయం పుట్టిస్తోంది. ఆయా నాయకుల ఇళ్ళ విషయంలో కూడా ఇలాంటి నిఘా వ్యవహారాలే నడుస్తున్నాయా అని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. అదే విషయంపై అంతర్గతంగా ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -