వైసీపీ పార్టీ అధికారంలోకి రావడానికి అభ్యర్థుల పేరు, ప్రతిష్టలకన్నా ఎక్కువ జగన్ ఇమేజ్ తోడయ్యింది అన్న వాదన ను ఎవరు కాదనలేం. ఎందుకంటే జగన్ మొహం చూసే నియోజకవర్గంలో ఎవరో నిలబడ్డారో కూడా తెలీని ప్రజలు వైసీపీ కి ఓటువేశారు.. ఆ నమ్మకాన్ని వందకు వంద శాతం నిలబెడుతున్న జగన్ ఆ క్రెడిట్ తానొక్కడినే తీసుకోకుండా అభ్యర్థులందరికీ, కార్యకర్తలందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.. సంక్షేమ పథకాల్లో తానున్న లేకపోయినా అక్కడి ఎమ్మెల్యేలతో చేయిస్తూ ప్రజలకు మేలు జరగడమే లక్ష్యం గా ముందుకు సాగిపోతున్నారు..
అదే సమయంలో జగన్ సీఎం అయినా దగ్గరి నుంచి ప్రతిపక్షాలు ఎదో విధంగా జగన్ తొక్కేయాలని చూస్తున్నాయి.. సీఎం గా ఎన్నాళ్ళు కొనసాగుతాడో చూస్తామన్నట్లు మొదట్లో వారి ప్రవర్తన ఉండగా చంద్రబాబు లాంటి నేతలని జగన్ నిలువరించడం చూసి జగన్ సామాన్యుడు కాదని అభిప్రాయపడ్డారు.. ఆ తర్వాత అరెస్ట్ ల పర్వం మొదలైన తర్వాత జగన్ ఎవరు పెద్దగా విమర్శించపోయినా పార్టీ లోని ముఖ్య నేతలు మాత్రం జగన్ ని ఎప్పుడెప్పుడు విమర్శిద్దామా అని చూస్తున్నారు.. టీడీపీ వారైతే మూడు రాజధానుల విషయం పై జగన్ ను టోటల్ విలన్ గా చేసి తాము హీరోలుగా మిగిలిపోవాలని ప్లాన్ వేసింది.. కానీ చంద్రబాబు అండ్ కో జోకర్లు గా మిగిలిపోయారు.
ఇక మాట ఇచ్చే ముందు ఆలోచిస్తాను.. మాట ఇచ్చాక ఆలోచించేది ఏముంది.. ముందుకు పోవడమే.. యాత్ర సినిమాలో వైఎస్సార్ పాత్ర పోషించిన నటుడు మమ్ముట్టి చెప్పిన డైలాగ్ ఇది. మాట ఇస్తే.. ఎంత కష్టమైనా.. నష్టమైనా వెనక్కి తగ్గని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిత్వాన్ని ఒక్క డైలాగ్లో ఆవిష్కరించారు. వైఎస్సార్ మాదిరిగానే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సాగిపోతున్నారు. మాట ఇచ్చిన తర్వాత.. వెనుతిరిగి చూడడంలేదు. కోవిడ్ వల్ల తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిర్ణీత సమయంలో అమలు చేస్తున్నారు.
మరో సంచలనానికి తెరతీసిన సీఎం జగన్..?
స్థానిక బలాన్ని నమ్ముకుంటున్న జగన్..