Friday, April 19, 2024
- Advertisement -

భ‌ర్త‌కు ద‌య్యెం ప‌ట్టింద‌ని న‌వ వ‌ధువుపై తాంత్రికుడు, మ‌ర‌ది అత్యాచారం

- Advertisement -

స‌మాజంలో రోజు రోజుకి మాన‌వ‌త్వం అట్ట‌డుగు స్థాయికి దిగ‌జారుతోంది. మ‌హిల‌ల‌పై అఘాయిత్యాలు మాన‌వ సంభంధాలు పూర్తిగా మంట‌గ‌లిసిపోతున్నాయి. త‌న అన్న భార్య అని చూడ‌కుండా మాంత్రికుడితో క‌ల‌సి త‌ల్లిలాంటి ఒదిన‌పై అత్యాచారానికి ఒడిగ‌ట్టాడు ఓ కామాంధుడు. ఈ సంఘ‌ట‌న యూపీలో చోటు చేసుకుంది.

ఎన్నో ఆశ‌ల‌తో అత్త‌గారింట్లో అడుగుపెట్టిన న‌వ వ‌ధువు జీవితం బుగ్గిపాల‌య్యింది. భర్తకు దెయ్యం పట్టిందని, అతను చనిపోకుండా చూడాలని, దెయ్యాన్ని వదిలించాల్సి వుందని చెబుతూ, మరిది, తాంత్రికుడు కలసి పెళ్లయిన రోజే వధువుపై అకృత్యానికి దిగారు.

మీరట్ సమీపంలోని లిసారీ గేట్ ప్రాంతానికి చెందిన బాధితురాలికి హార్పూర్ జిల్లాలో వస్త్ర వ్యాపారితో 15వ తేదీన వివాహం జరిగింది. పెళ్లి తరువాత ఆమెకు స్వల్పంగా మత్తుమందు కలిపిన పానీయాన్ని తాగించారు. ఆపై ఓ తాంత్రికుడు వచ్చి, భర్త గురించి చెప్పాడు. తొలిరాత్రి భర్తతో కలవరాదని, మరిదితో కలవాలని, అప్పుడే భర్త బతుకుతాడని చెబుతూ, మరిదితో కలసి అత్యాచారం చేశారు.

స్ప్రుహ లోకి వ‌చ్చిన పెల్లికూతురు తల్లికి విషయం తెలిపింది. ఇది జరిగినవారం తరువాత ఆమె పోలీసులను ఆశ్రయించగా, మీరట్ పోలీసులు ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -