జియో ఇచ్చిన షాక్ తో ఇతర టెలికం కంపెనీలు.. అదిరిపోయే ఆఫర్స్ ఇస్తున్నాయి. లేటేస్ట్ గా బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన సరికొత్త బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ గడువు పొడిగించినట్లు సమాచారం. బీబీ అన్లిమిటెడ్ 249 పేరుతో మొదలు పెట్టిన ఈ ప్లాన్ లో రూ. 249కే ఈ నెలకు 300 GB డేటా లభిస్తోంది. రోజుకి 10 GB 2 ఎంబీపీఎస్ స్పీడ్తో అందుబాటులో ఉంటుంది.
దీనికి పైబడి వినియగిస్తే స్పీడ్ 1 ఎంబీపీఎస్కు తగ్గుతుంది. ఒకవేళ మీరు డేటా వాడకుండా అలానే ఉంచుకుంటే మరుసటి రోజు మిగిలిన డేటా కలుస్తోంది. రోజూ రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటల వరకు ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని త్వరలో ఆదివారాల్లో పూర్తిగా వర్తింపజేస్తారని, అన్ని నెట్వర్క్లకు విస్తరిస్తారని తెలుస్తోంది. కొత్త బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు పరిమితం చేసిన ఈ ఆఫర్ ఆరు నెలల పాటు కొనసాగుతుంది. తర్వాత రూ.499 ప్లాన్గా మారుతుంది. బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్సైట్లో ‘249 ప్లాన్’ ఈ ప్లాన్లో చేరేందుకు మార్చి 31 వరకు గడువుగా పేర్కొన్నా.. ఇంకొన్నాళ్లు పొడిగిస్తారని తెలిసింది.
Related