Wednesday, April 24, 2024
- Advertisement -

బాబు ఓటమిలో కొత్త కోణం ఇదీ..

- Advertisement -

అర్ధరాత్రి, తెల్లవారు జాము వరకు మహిళలు నిలబడి ఓటేశారని.. వారంతా పసుపు కుంకుమ లబ్ధిదారులని.. విజయం తమదేనని చంద్రబాబు ధీమాగా చెప్పారు. కానీ సీన్ చూస్తే తేడా కొట్టింది. వారు ఓటేసింది సైకిల్ కు కాదు.. ఫ్యాన్ కేనని తేలిపోయింది. 10వేల రూపాయల చొప్పునా పంచినా కూడా బాబుకు ఎందుకు ఓటేయలేదని తాజాగా చంద్రబాబు సమీక్ష నిర్వహించగా ఆశ్చర్యక సమాధానాలు వచ్చినట్టు తెలిసింది.

ప్రధానంగా ఈ ఐదేళ్లలో చంద్రబాబు చేసిన తప్పిదాలే మహిళల కోపానికి కారణమయ్యాయని చెబుతున్నారు. ఐదేళ్లలో మహిళల డ్వాక్రా గ్రూపులను పట్టించుకోకుండా వారి రుణాలను మాఫీ చేయకుండా .. వడ్డీలు చెల్లించకుండా బాబు సర్కార్ సృష్టించిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావంటున్నారు.

అందుకే చివర్లో 10 వేల రూపాయలు వేసినా వారంతా బాబుపై కోపాన్ని మాత్రాన్ని వీడలేదు. మిగిలిన వడ్డీ డబ్బులు సంపూర్ణ రుణమాఫీ ఎవరు చేస్తారంటూ వైసీపీ అధినేత సంధించిన ప్రశ్నలు మహిళలు ఓన్ చేసుకున్నారు. దాంతో పసుపు పార్టీని దెబ్బకొట్టి జగన్ కు జై కొట్టారు మహిళలు..

అయితే ఎన్నికలకు నెల ముందు అమలు చేయడమే చంద్రబాబుకు పెద్ద మైనస్ అని అంటున్నారు. అదేదో ముందే ఏడాది క్రితమే మహిళలకు లబ్ధి చేకూరిస్తే బావుండేదన్న టాక్ ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆరు నెలల ముందుగా చేసిన జిమ్మిక్కును మహిళలు నమ్మలేదని తేలిపోయింది. ఇక ముందైనా పార్టీలు ఇలాంటివి చేసే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తే మంచిదంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -