Saturday, April 20, 2024
- Advertisement -

జగన్ ఇలా ముందుకెళ్తే పదేళ్లు గ్యారెంటీనే..

- Advertisement -

వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేరు.. వైఎస్ జగన్ వేరు అని.. ఆయన ఫ్యాక్షన్ పగ చూపుతారని టీడీపీ మీడియా మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎంతో రాజకీయం చేశాయి. వైఎస్ జగన్ బాబాయ్ వివేకా హత్యను కూడా చిలువలు పలువలు చేసి జగన్ ను రాజకీయంగా దెబ్బతీయడానికి నానా రకాల ప్రయత్నాలు చేశాం. కానీ ప్రజలు జగన్ విశ్వసనీయతకు ఓటేశారు. అన్నేళ్ల పాదయాత్ర.. ప్రజల కోసం పోరాటానికి ఓటేశారు..

జగన్ సీఎం కాగానే స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఆయన బాడీ లాంగ్వేజ్, ప్రవర్తన, ఆశయ సాధనలో ముందుకెళ్లాలన్న తపనతో పూర్తిగా మారిపోయారని చెప్పవచ్చు. అధికారంలోకి రాగానే.. తనను టార్గెట్ చేసిన మీడియాకు, నాయకులపై ప్రతీకార చర్యలుండవని ప్రకటించడం జగన్ గొప్పతనానికి నిదర్శనంగా చెప్పవచ్చు. అంతేకాదు.. అనంతరం ఫ్యాక్షన్ ఫ్యామిలీ అయిన పరిటాల సునీతకు గన్ మెన్లను పెంచి సెక్యూరిటీ కల్పించారు. ఈ చర్యపై స్వయంగా పరిటాల సునీత.. జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇక విశాఖ శారదా పీఠం పర్యటనలో జగన్ వస్తుండగా క్యాన్సర్ రోగంతో అంపశయ్యపై ఉన్న తమ స్నేహితుడిని కాపాడాలని ఫ్లెక్సీ ప్రదర్శించిన యువకుల అభ్యర్థులను చూసి జగన్ స్వయంగా ఆగి మరీ ఆ యువకుడికి ప్రభుత్వ పరంగా చికిత్స చేయిస్తామని.. హామీ ఇచ్చారు. ఆపరేషన్ చేయించారు.

ఇక జగన్ ప్రభుత్వంలోనూ, పాలనలోనూ స్వచ్ఛ అవినీతి లేని పాలన కోసం ముందడుగు వేశారు. జ్యూడిషియల్ కమిషన్ వేసి దాని ద్వారానే ప్రభుత్వం కాంట్రాక్టులు, పనులను అవినీతికి తావులేకుండా చేస్తానన్నారు. ఇలా ప్రతీ అంశంలోనూ జగన్ తన మార్కు చూపిస్తున్నారు. తన సహజశైలికి భిన్నంగా అందరికి మేలు జరిగేలా చేస్తున్నారు. ఈ పరిణామం జగన్ ను ఖచ్చితంగా వచ్చే పదేళ్లు రాజకీయాల్లో గెలిచేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు ఘంటా పథంగా చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -