Tuesday, April 23, 2024
- Advertisement -

కాలేజీ అమ్మాయిపై గ్యాంగ్ రేప్

- Advertisement -

అమ్మాయిలపై రోజురోజుకూ హత్యచార దాడులు పెరిగిపోతున్నాయి. అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే.. మగాళ్ళు మృగాలుగా మారి హత్యచార దాడులు చేస్తున్నారు. న్యూఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన లాంటి మరో ఘటన తాజాగా ఓడిశాలోని కటక్ జిల్లాలో జరిగింది.

కటక్ జిల్లాలో ప్రైవేటు బస్సు డ్రైవరు, కండక్టర్లు అయిన సంతోష్ సాహూ, బీబ్ హుతి లు కలిసి ఓ కళాశాల యువతిపై సామూహిక అత్యాచారం జరిపి, ఆపై ఆమె తలపై ఇనుప రాడ్ తో కొట్టి చంపి మృతదేహాన్ని జటముండియా వద్ద మహానదిలో పడవేశారు. యువతి మృతదేహాన్ని జటముండియా బ్రిడ్జి వద్ద కనుగొన్నట్లు అతాఘడ్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి అమ్రీష్ పాణిగ్రాహి చెప్పారు.

గౌరంగాపూర్ గ్రామమానికి చెందిన ఆ యువతి బస్సు డ్రైవరు సంతోష్ సాహూతో గత రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం సాగుతుందని పోలీసులు చెప్పారు. పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి చేసినందుకే ప్రియుడైన డ్రైవరు సంతోష్ సాహూ వ్యూహం ప్రకారం యువతిని బస్సులో తీసుకెళ్లి అందులోనే కండక్టరుతో కలిసి గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశాడని పోలీసులు పేర్కొన్నారు. నిందితులిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

Related

  1. రేప్ అవబోతున్న అమ్మాయిని కాపాడిన రజినీకాంత్ అభిమాని
  2. ఫేస్‌బుక్‌ ప్రేమ రేప్ కేసుగా మారింది!
  3. నిర్మాత మేనల్లుడు రేప్ చేసాడట
  4. డాన్సర్లను గ్యాంగ్ రేప్ చేసిన 12 మంది దుండగులు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -