యూజర్లకు టెలికాం కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తోంది. డేటా సేవల్లో జియో ఇచ్చిన ఉచిత సూపర్ ఆఫర్ల నుంచి తమ వినియోగదారులను రక్షించుకునేందుకు మిగిలిన టెలికం సంస్థలు కుడా ఏదో ఒక ఆఫర్తో ముందుకు వస్తున్నాయి. ఈ నెపథ్యంలోనే ప్రభుత్వ రంగ టెలికాం సర్వీసుల సంస్థ బీఎస్ఎన్ఎల్ తన ఖాతాదారుల కోసం సరికొత్త ప్లాన్ను ప్రకటించింది.
బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన ఈ కొత్త ఆఫర్ ప్లాన్ రూ. 339 రీచార్జ్పై రోజుకు 3జీ 2జీబీ డేటా ఆఫర్ చేస్తోంది. బీఎస్ఎన్ఎల్ టు బీఎస్ఎన్ఎల్ అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ 28 రోజుల పాటు అమల్లో ఉంటుంది. అలాగే ఇతర నెట్ వర్క్లకు రోజుకు 25 నిమిషాల పాటు కాల్స్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ 90 రోజుల పాటు చెల్లుబాటులో ఉండనుంది. రోజుకు బయట కంపెనీలకు చేసుకునే 25 నిమిషాల ఉచిత కాల్స్ ప్రతి నిమిషానికి 25 పైసలు చార్జ్ చేయనున్నట్టు ఆయన తెలిపారు. రిలయన్స్ జియో ఇస్తున్న ఉచిత కాల్స్ పథకానికి, అలాగే ఏప్రిల్ 1నుంచి ప్రారంభించనున్న రూ.303 ప్రైమ్ మెంబర్షిప్ పథకాన్ని తీసుకొచ్చింది.
{youtube}KoWnuNKn4Oo{/youtube}
Related