Friday, April 19, 2024
- Advertisement -

సెంట్రల్ లో కొత్త పార్టీ పెట్టబోతున్న కేసీఆర్.. బీజేపీ పై పోరాటం..!!

- Advertisement -

తెలంగాణాలో ఎదురులేని నేతగా ఉన్న కేసీఆర్ గత కొన్ని రోజులుగా నేషనల్ లెవెల్ రాజకీయాలపై ద్రుష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే.. వాస్తవానికి మొన్నటి ఎలక్షన్స్ లోనే కేసీఆర్ సెంట్రల్ లో పాలిటిక్స్ మొదలుపెట్టాల్సి ఉంది కానీ అనూహ్యంగా తెలంగాణాలో ఎంపీ సీట్లను తక్కువగా గెల్చుకోవడం, బీజేపీ మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడంతో కొంత తగ్గారు.. తేకాదు దేశవ్యాప్తంగా ప్రజలలో జాతీయ పార్టీలపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని ప్రాంతీయ పార్టీలన్ని ఏకం చేసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉంటాయని చెప్పుకొచ్చాడు.

అయితే ఆ ఎన్నికలలో సీఎం కేసీఆర్ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 17 లోక్‌సభ స్థానాలకు కాను టీఆర్ఎస్ కేవలం 9 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక దేశ వ్యాప్తంగా బీజేపీ భారీ మెజారిటీతో రెండో సారి అధికారంలోకి వచ్చింది. దీంతో అప్పటి నుంచి కాస్త సైలెంట్ అయిన సీఎం కేసీఆర్ మళ్ళీ దేశ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారని సమాచారం.

త్వరలో హైదరాబాద్‌లో గ్రేటర్ ఎన్నికలు రాబోతుండడంతో ఆ ఎన్నికలలో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలిస్తే ప్రస్తుత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ని సీఎంగా ప్రకటించి కేసీఆర్ దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టేందుకు సిద్దమయ్యారట. ఇందుకోసం జాతీయ స్థాయిలో “నయా భారత్” పేరుతో కొత్త పార్టీనీ పెట్టబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. దేశంలో అధ్యక్ష తరహా ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనలకు వ్యతిరేకంగా పనిచేసేలా కొత్త పార్టీనీ రూపొందించబోతున్నట్టు తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -