Friday, March 29, 2024
- Advertisement -

యమదొంగ హీరోయిన్ మమత ఇప్పుడేం చేస్తుందంటే ?

- Advertisement -

ప్రస్తుత హీరోయిన్స్ సినిమాలు చేస్తూనే ఇంకోవైపు నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన ఛార్మి పూరి జగన్నాథ్ దయవల్ల నిర్మాతగా మారి బానే కూడబెడుతోంది. సమంత కూడా నిర్మాతగా సొంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసేందుకు సిద్దం అవుతోంది.

తెలుగులో యమదొంగ, కింగ్‌ సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన మమతా మోహన్‌దాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె ఇప్పటికే అన్ని భాషల్లో నటించింది. మమత సింగర్ కూడా బాగా పాపులర్. తెలుగులో రాఖీ రాఖీ సాంగ్ ని ఈమె పాడింది. ఆ మధ్య క్యాన్సర్ బారిన పడు కోలుకున్న తర్వాత మలయాళంలో సినిమాలు చేస్తోంది. ఇప్పుడు నిర్మాతగా కూడా మారారు. మమతా మోహన్‌దాస్‌ ప్రొడక్షన్స్‌ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారామె.

ఈ విషయం గురించి మమతా మోహన్‌దాస్‌ మాట్లాడుతూ నిర్మాణంలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. కల నిజం అవుతున్నట్టుంది. ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉన్న అందరికీ ధన్యవాదాలు. నన్ను ఇంత ఆదరించిన ఇండస్ట్రీకి తిరిగి ఇవ్వాలనే ఆలోచన నుంచే ఈ నిర్మాణ సంస్థను స్థాపించాను అన్నారు. మొదటి ప్రయత్నంగా లేడీ ఓరియంటెడ్‌ చిత్రంను నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

షియాజీ షిండే సినిమాల్లోకి రాకముందు ఏం పని చేశేవారో తెలుసా ?

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు..!

సౌందర్య వందల కోట్ల ఆస్తులు ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసా ?

మన దర్శకుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -