Friday, March 29, 2024
- Advertisement -

విజయశాంతి పిల్లల్ని కనకపోవడానికి కారణం ఇదే..!

- Advertisement -

సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చింది సీనీయర్ నటి విజయశాంతి. దాదాపు అందరి స్టార్ హీరోల సరసన ఆమె నటించింది. సినిమాలకు బ్రేక్ ఇచ్చి దాదాపు 13ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు మళ్లీ మహేష్ బాబు హీరోగా చేసిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో రీ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా విజయశాంతి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు చెప్పుకొచ్చింది.

తన 17వ యేటనే తన తండ్రి మరణించాడని అలాగే తన 18వ ఏట తన తల్లి కూడా మరణించినట్లు ఆమె తెలిపారు. తన తల్లిదండ్రులు ఇద్దరూ మరణించడంతో కొంతకాలం మానసిక వేదనతో కృంగిపోయానని అన్నారు. తల్లిదండ్రులు చనిపొయిన తర్వాత తమ బంధువులు కనీసం తనను పట్టించుకోలేదని.. కనీసం తిన్నావా అని కూడా అడిగేవారు కాదని.. అలాంటి పరిస్థితులు ఎదుర్కొని ముందుకు వచ్చానని చెప్పింది.

అంతేకాకుండా తన భర్త అయినటువంటి శ్రీనివాస ప్రసాద్ పరిచయమై మంచి అండదండలు అందించారని తన మంచి మనసును చూసే పెళ్లి చేసుకున్నారని అన్నారు. ఆ తర్వాత ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చానని.. ప్రజలను తన కన్నబిడ్డలుగా భావించి వారికి సేవ చేశానని అన్నారు. అందువల్లనే పిల్లల్ని కనకూడదని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

అంతేకాకుండా ఒకవేళ పిల్లల్ని కంటే వారి కోసం ప్రత్యేకమైన సమయం కేటాయించాల్సి వస్తుందని.. లేకుంటే వారు చెడు దారులను ఎందుకునే అవకాశం ఉందని అలాంటి వారి వల్ల సమాజానికి మరింత అపాయం కలుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏది ఏమైన ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం అనేది గ్రేట్ అని చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -