సోషల్ మీడియా ద్వారా ఎలాంటి వార్త అయిన తక్కువ కాలంలో ఎక్కువ మందికి చేరవేయొచ్చు. సూపర్ టైటిల్ పెట్టి.. ఆగమాగం చేయవచ్చు. ప్రస్తుతం జరుగుతుంది అదే. సోషల్ మీడియా ఎన్నో అనర్ధాలకు వేదిక అవుతోంది. అదే సోషల్ మీడియా చాలా మంచి పనులకు పునాది అవుతోంది.
కాకపోతే.. దీన్ని వాడుకునే తీరులోనే ప్రాబ్లమ్ ఉంది. మంచి కోసం వాడితే పర్లేదు.. కానీ చేడు కోసం వాడితే.. చాలా మందిని తప్పుడు దారిలోకి నెట్టవచ్చు. వాస్తవమే.. ఒక్క బ్యుటీషియన్ శిరీష కేసుకు సంబంధించి.. సోషమ్ మీడియాలో చాలా పోస్టులి.. లైక్ లు.. పోలీసులకు రాని అనుమానాలు,పోలీసులు చేయని ఇంటరాగేషన్లు.. చేయడం సోషల్ మీడియాకే ఎక్కువగా వచ్చు. ఉన్న నిజం ఒకటి అయితే.. అందులో వేరే అర్ధలు వెతికి.. ఆమె అట్లనటా,ఆయన గిట్లనట అంటూ.. పోస్టులు పెడుతున్నారు. అదే ఓ రైతు అప్పుల భాదతో చనిపోతే.. ఒక ఆర్టీకల్ రాస్తే.. చదివే వ్యక్తి లేడు. వేలల్లో ఒక్కరు మాత్రమే అలాంటి వార్తను చూస్తున్నారు. దాంతో సోషల్ మీడియా కూడా చూడని ఆర్టికల్స్ వైపు మొగ్గు చూపడం లేదు. పబ్లిక్ ఏ వార్తలను ఇష్టపడుతున్నారో అలాంటి వార్తలను రాయడానికే ప్రియారిటీ ఇస్తున్నారు.
{loadmodule mod_custom,GA1}
అలానే హీరో రవితేజ తమ్ముడు చనిపోతే.. ఆయన ఫ్యామిలీ ఎందుకు రాలేదు.. రవితేజ ఎందుకు రాలేదు అనే విషయాలపైన కాంట్రవర్సీ చేసి కుప్పలు కుప్పలుగా వచ్చాయి. ఇవి రాయడం తప్పు కాదు.. చదవటం తప్పు కాదు. కానీ సంబంధం లేని వాళ్ల విషయంలో దూర్చటం కాకుండా.. ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిపై దృష్టి సారిద్ధాం. రైతులకు సంబంధించిన వార్తలను చదువుద్దాం. పది మందికి తెలియజేద్దాం. ప్రభుత్వాలని నిలదీద్ధాం..రైతన్నలకు అండగా నిలుద్దాం…
మన మైండ్ సెట్ ను మార్చేదాం.. అవసరం లేని కాంట్రవర్సీలపై కాకుండా రైతన్నల కు ఉపయోగపడే వార్తలను ఎక్కువగా చదువుదాం. మీరు మీకిష్టమొచ్చిన వార్తను.. చదవండి.. అలానే రైతన్నలకు సంబంధించి,అలానే మానవత్వానికి సంబంధించిన వార్తలపై కూడా ఓ కన్నేయండి. ప్రజలకు బాగా దగ్గరైన తీన్మార్ న్యూస్ లో ఇదే అంశం పై సూటిగా నిలదీయటం జరిగింది. సోషల్ మీడియాలో వస్తున్న.. వాటిపై వార్తను వదిలింది. అలాగే సోషల్ మీడియాను ఫాలో అవుతున్న నెటిజన్ల.. అనవసరపు విషయలపై.. లైక్ లు.. షేర్ లు.. పిచ్చిపిచ్చి కామెంట్స్ చేయడం బాధాకారం. ఇప్పటికైన మనం మారుదాం.. తెలుసుకోని.. తెలియజేద్దాం… అందరి మంచి కోసమే ఈ ఆర్టికల్.
{youtube}028yNhbFPS4{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related