Saturday, April 20, 2024
- Advertisement -

టిడిపిలో వైకాపా కోవర్టులు……. బాబుకు మరో షాక్

- Advertisement -

ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అథోగతే అని చంద్రబాబు అనుక్షణం చెప్తూ ఉంటాడు కానీ ఎపి ప్రజలకు అలాంటి భయాలేమీ లేవు అన్న విషయం ఇప్పటికే చాలా సర్వేల్లో వెల్లడైంది. అయితే చంద్రబాబు అండ్ బ్యాచ్, ఆయన ఎల్లో మీడియా జనాలకు మాత్రం ఎక్కడ జగన్ అధికారంలోకి వస్తాడో అన్న దడ మామూలుగా లేదు. అధికారంలోకి వస్తే బాబుతో సహా బాబు బ్యాచ్ జనాలందరూ చేసిన తప్పులన్నింటికీ ఫలితం అనుభవించేలా చట్టప్రకారమే చర్యలు ఉంటాయని ఇప్పటికే వైఎస్ జగన్ స్పష్టం చేశాడు. అందుకే వైఎస్ జగన్ ఎక్కడ అధికారంలోకి వస్తాడో అని భయపడుతున్న బాబు అండ్ బ్యాచ్……. వాళ్ళ వ్యక్తిగత భయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై రుద్దాలని చూస్తున్నారు. చేసినపనుల గురించి, నెరవేర్చిన హామీల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు కదా……… అందుకే జగన్‌ని బూచీగా చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

మరి అధినేత స్థాయి వ్యక్తులు, ఆర్థికబలం, మీడియా బలం ఉన్నవాళ్ళే ఈ స్థాయిలో భయపడుతుంటే ఇక కింది స్థాయి నాయకుల గురించి చెప్పేదేముంది. చంద్రబాబే ఓటమి ఖాయం అన్నట్టుగా టెన్షన్ పడుతూ ఉండడంతో కింది స్థాయి నేతలు ఇంకా భయపడుతున్నారు. అందుకే ఆయా నేతలు వైకాపా నేతలకు టచ్‌లోకి వెళ్తున్నారు. మేం కూడా వైకాపా గెలుపుకే మద్దతిస్తాం. జగన్ గెలిచాక మాకు ఇబ్బందులు లేకుండా కాస్త సహకరించేలా చెయ్యండి అని వైకాపా నాయకులతో రాయబేరానికి వస్తున్నారట. టిడిపిలో ఉన్న ఇలాంటి వైకాపా కోవర్టుల గురించి ఇప్పుడు చంద్రబాబుకు కొత్త టెన్షన్ పట్టుకుందని టిడిపి నాయకులే చెప్తున్నారు. స్వయంగా తోకపత్రిక కూడా ఈ కోవర్టుల గురించి వార్తా కథలు రాసిపడేస్తోంది. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు ఘోర ఓటమి తప్పదన్న విశ్లేషణలు, సర్వేల నేపథ్యంలో టిడిపి నాయకుల్లో నమ్మకం కలిగించడానికి చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -