రాజకీయ వ్యూహాలు, కుట్రల విషయంలో మాత్రం చంద్రబాబును తలదన్నే స్థాయి నాయకుడు దేశంలోనే లేడు అన్నది నిజం. ఇప్పుడు ఇదే విషయాన్ని బిజెపి నేతలు కూడా ఒప్పుకుంటూ ఉన్నారు. 2014 ఎన్నికల్లో మోడీ క్రేజ్ని వాడుకున్న చంద్రబాబు…..ఇప్పుడు అదే మోడీపైన ఉన్న వ్యతిరేకతను వాడుకోవడానికి రెడీ అయిపోయాడు. దటీజ్ చంద్రబాబు. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచిన సమయంలో కూడా స్వయాన ఎన్టీఆర్ కొడుకు…..అలాగే సినిమా వారసుడు అయిన బాలకృష్ణను కూడా తనవైపు తిప్పుకున్నాడు చంద్రబాబు. అంతకుముందు ఓ సారి తన రాజకీయ వారసుడిగా బాలకృష్ణని ప్రకటించాలని ఎన్టీఆర్ ప్రయత్నిస్తే బాబే స్వయంగా అడ్డుకున్నాడు.
ఇప్పుడు కూడా జగన్కి అత్యంత సన్నిహితుడు, జగన్ కుటుంబ సభ్యుడిలాంటి వాడు అయిన విజయసాయిని ట్రాప్ చేయాలని ప్రయత్నించాడు చంద్రబాబు. విజయసాయిపై ఉన్న కేసులు అన్నీ ఎత్తేయిస్తాం అని విజయసాయికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ప్రజారాజ్యం పార్టీలో ఉంటూనే ఆ పార్టీని సర్వనాశనం చేసిన పరకాల ప్రభాకర్ స్టైల్లోనే లేక వేరే రకంగానో జగన్ని పూర్తిగా ముంచాలన్నది కుట్ర సిద్ధాంతం. ఆ మధ్య టిడిపి ముఖ్య నాయకులు కూడా వైకాపా నుంచి అతి పెద్ద వికెట్ తమ జేబులోకి రాబోతోంది అని ప్రకటనలు గుప్పించింది ఇందుకే. అయితే విజయసాయి మాత్రం టిడిపి ఆఫర్ని తీసుకొచ్చిన జనాలతో……. ‘మనుషులేనా మీరు?’ అని ఘాటుగా కౌంటర్ ఇచ్చాడట. విజయసాయి తీవ్రస్థాయిలో విరుచుకుపడడంతో బాబు బ్యాచ్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు.
అయితే ఇక ఆ తర్వాత నుంచీ బాబు అసలు వ్యూహం మొదలైంది. వైకాపాలో ఎంతమంది నాయకులు ఉన్నప్పటికీ అందరూ కూడా జగన్ కష్టంతో అధికారం వస్తే ఎంజాయ్ చేద్దాం అనుకునే బాపతు నాయకులే. అయితే ఒక్క విజయసాయిరెడ్డి మాత్రం జగన్కి రైట్ హ్యాండ్ అనే స్థాయిలో బలమైన ఆయుధంగా తయారయ్యాడు. అందుకే ఇప్పుడు విజయసాయి విశ్వసనీయతను పూర్తిగా దెబ్బతీయడమే లక్ష్యంగా బాబు అండ్ కో ప్లాన్ చేస్తున్నారు. జగన్ కంటే కూడా విజయసాయినే ఎక్కువగా లక్ష్యంగా పెట్టుకోవడం గమనార్హం. ఈ ప్రయత్నంలో టిడిపి జనాలు సక్సెస్ అవుతారో…… లేక విజయసాయినే బలమైన నాయకుడిగా ఎదుగుతాడో చూడాలి మరి.