Friday, March 29, 2024
- Advertisement -

నువ్వే కావాలి హీరోయిన్ గుర్తుందా ?

- Advertisement -

తెలుగులో వచ్చిన నువ్వే కావాలి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు కె.విజయభాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. లవర్ బాయ్ తరుణ్ హీరోగా నటించగా.. రిచా పల్లాడ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండేల్లో ఈమె ఉండిపోయింది.

అయితే తెలుగులో హిట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినటువంటి ఈ అమ్మడు అవకాశాలు మాత్రం ఎక్కువ దక్కించుకోలేకపోయింది. అయితే తమిళం, హిందీలో మాత్రం వరుస ఛాన్సులు దక్కించుకుంది. ఆ సినిమాలు కూడా పెద్దగా ఆడకపోవడంతో హీరోయిన్ గా నిలదొక్కుకోలేక పోయింది. అయితే రిచా పల్లాడ్ కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో పుట్టి పెరిగింది. అందువల్ల సౌత్ ఇండియా భాషలు అయినటువంటి తమిళం, కన్నడ, తెలుగు భాషల్లో మంచి ప్రావీణ్యం సంపాదించింది.

అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే వ్యాపారవేత్తతో ప్రేమలో పడింది. అతడిని పెళ్లి చేసుకుంది. దాంతో ప్రస్తుతం రిచా పల్లాడ్ కి ఒక ఒక బాబు కూడా ఉన్నాడు. ప్రస్తుతం రిచా పల్లాడ్ తన భర్తకు సాయంగా ఉంటూ కుటుంబ బాధ్యతలను చూసుకుంటుంది. అయితే చివరిగా రిచా పల్లాడ్ తెలుగులో ఆది పినిశెట్టి హీరోగా నటించినటువంటి “మలుపు” అనే చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ రిచా సినిమాల్లో నటించలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -