Wednesday, April 24, 2024
- Advertisement -

ఈ స్టార్ హీరోలకంటే వారి భార్యలకే ఎక్కువ ఆస్తి ఉందట..!

- Advertisement -

టాలీవుడ్ లో మహేష్ బాబు సూపర్ స్టార్. ఆయన 2005 లో హీరోయిన్ నమ్రత ను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన క్రేజ్ మరింత పేరిగిపోయింది. మహేశ్, నమ్రత కలిసి ‘వంశీ’ సినిమాలో నటించారు. ఆ మూవీ షూటింగ్ టైంలోనే వీరిద్దరు ప్రేమలో పడి.. పెళ్లి చేసుకున్నారు. నమ్రత మహారాష్ట్ర కు చెందిన అమ్మాయి. మహేష్ తో పెళ్లయ్యాక ఈమెకు భారీ స్థాయిలో ఆస్తులు కట్ట పెట్టారట.

ఇక మరో స్టార్ ఎన్టీఆర్ కూడా 2011 లో లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్నాడు. ఈమె తండ్రి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి. దాంతో పాటు ఓ మీడియా ఛానల్ కూడా ఉంది. ఎన్టీఆర్ తో పెళ్లయ్యాక ఈమెకు కూడా భారీ స్థాయిలో ఆస్తులు ఇచ్చారట. ఇక మెగా వారసుడు రాంచరణ్ 2012 లో ఉపాసన ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈమెకు కూడా భారీ స్థాయిలో ఆస్తులు ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ సి రెడ్డి మనవరాలు కావడంతో ఈమె కూడా భారీ స్థాయిలో ఆస్తులు మెట్టినింటికి తీసుకెళ్లారని తెలుస్తుంది.

అయితే ఈ ముగ్గురు స్టార్ హీరోల భార్యలు ఎంత పెద్ద ఇంటి నుంచి వచ్చినా.. ’డౌన్ టు ఎర్త్’ ఉంటారట. మా భర్త పెద్ద స్టార్ హీరో కదా.. మేము హ్యాపీగా కాలు మీదా కాలు వేసుకుని కాలం కడిపేద్దాం అనే ఆలోచన వీరికి ఉండదట. ఎప్పుడు ఏదో ఒక వర్క్ తో బిజీగా ఉంటారట. కష్టాల్లో ఉన్న వారికి చేయూతనివ్వ డానికి ముందు ఉండే గొప్ప మనసు వీరిదట. అంతకు మించిన గొప్ప ఆస్తి ఏముంది అని నెటిజన్లు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -